Bengaluru: బెంగళూర్లో ఆటో రైడ్ క్యాన్సిల్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రైడ్ యాప్ ద్వారా ఆటోని బుక్ చేసుకున్న మహిళా ప్రయాణికురాలు రైడ్ని క్యాన్సిల్ చేసుకున్నందుకు సదరు ఆటో డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడ్డారు.
ఖరీదైన పట్టుచీరలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.17.5 లక్షల విలువైన 38 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
Bengaluru: కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటన మరవకముందే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూర్లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని బైకర్ అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Bengaluru Techie Missing: ఇటీవల బెంగళూర్కి చెందిన టెక్కీ 37 ఏల్ల విపిన్ గుప్తా కనిపించకుండా పోయాడు. ఆ కేసు ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భర్తను కనుగొనాలని భార్య సోషల్ మీడియాలో ఏడుస్తూ సాయం కోరడం చర్చనీయాంశంగా మారింది. విపిన్ గుప్తా మిస్సింగ్పై ఆమె బెంగళూర్లోని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసింది.
Live Location: బెంగళూర్లో ఒక మహిళ హత్య, ఆమె డెడ్బాడీని కనుగొనేందుకు పోలీసులకు ‘‘లైవ్ లొకేషన్’’ సాయపడింది. హత్యకు కొన్ని నిమిషాల ముందు సదరు మహిళ ఆమె స్నేహితురాలికి పంపిన లొకేషన్ కీలకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, లలిత అలియాస్ దివ్య తన స్నేహితురాలికి పెట్టిన లైవ్ లొకేషన్ ఆమె మృతదేహాన్ని కనుగొనేందుకు సాయపడింది. రామనగర జిల్లా మగాడి హుజగల్ కొండ అటవీ ప్రాంతలోని గోతిలో 32 ఏళ్ల బ్యూటీషియన్ని పూడ్చిపెట్టారు.
Cooker blast:బెంగళూర్ నగరంలో కుక్కర్ పేలుడు ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని స్థానిక పోలీసులు తోసిపుచ్చగా, మరోసారి విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సంఘటన స్థలానికి చేరుకుంది.
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించేందుకు వెళ్తున్నారు. నేటి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10. 15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.
బెంగళూరులో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించే సాహసం చేశాడు. ప్రమాదమని తెలిసినా కూడా ఏ మాత్రం భయపడకుండా డేరింగ్ అరెస్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.