Mahalakshmi Murder: మహాలక్ష్మీని 59 ముక్కలు ఎందుకు చేశాడో చెప్పిన ముక్తి రంజన్ తల్లి..
- బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు..
- మహాలక్ష్మీ వేధింపులకు పాల్పడటం వల్లే 59 ముక్కలుగా నరికేశాడు: ముక్త రంజన్ తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఒక వార్తా పత్రికతో ముక్తి రంజన్ తల్లి మాట్లాడుతూ.. మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో కంగారుగా రంజన్ ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని అడిగితే.. బెంగళూరులో ఓ మహిళను హత్య చేసినట్లు తెలిపాడని ఆమె పేర్కొనింది. దీంతో ఎందుకు చేశావాని ఆరా తీయగా.. బాధితురాలు తన నుంచి డబ్బు, బంగారు గొలుసు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. అలాగే, కొంత మందితో కలిసి నన్ను బెరించిందని ముక్తి రంజన్ ప్రతాప్ చెప్పాడని ఆమె వెల్లడించింది.
Read Also: VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
ఇక, 15 రోజుల క్రితమే ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ మహాలక్ష్మీ ఇంటికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటా.. కోపంలో ఆమెను గొంతుకోసి చంపేశాడని నాతో చెప్పినట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొనింది. ఈ విషయం తెలియగానే.. షాక్ అయ్యాను అన్నారు. కానీ, బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ముక్త రంజన్.. పోలీసుల విచారణ వల్ల మా కుటుంబానికి ఏం జరగొద్దనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని చెప్పిన కాసేపటికే సూసైడ్ చెసుకున్నాడని తెలిసిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.
Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు
కాగా, ముక్త రంజన్ బుధవారం నాడు ఒడిశాలోని తన స్వగ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న సమీపంలో లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో మహాలక్ష్మీ పెళ్లికి అంగీకరించినప్పటికి మరో వ్యక్తితో శారీరకంగా కలిసినట్లు అందులో రాసుకొచ్చాడు. అలాగే, నా దగ్గర నుంచి డబ్బు, బంగారం కోసం వేధింపులకు గురి చేసిందన్నాడు. వాటిని సహించలేకపోయా.. అందుకే ఆమెను చంపి 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్జులో పెట్టేశానని ముక్తి రంజన్ ప్రతాప్ తన డైరీలో ప్రస్తావించాడు.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!