Mahalakshmi Murder: మహాలక్ష్మీని 59 ముక్కలు ఎందుకు చేశాడో చెప్పిన ముక్తి రంజన్ తల్లి..
- బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు..
- మహాలక్ష్మీ వేధింపులకు పాల్పడటం వల్లే 59 ముక్కలుగా నరికేశాడు: ముక్త రంజన్ తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఒక వార్తా పత్రికతో ముక్తి రంజన్ తల్లి మాట్లాడుతూ.. మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో కంగారుగా రంజన్ ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని అడిగితే.. బెంగళూరులో ఓ మహిళను హత్య చేసినట్లు తెలిపాడని ఆమె పేర్కొనింది. దీంతో ఎందుకు చేశావాని ఆరా తీయగా.. బాధితురాలు తన నుంచి డబ్బు, బంగారు గొలుసు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. అలాగే, కొంత మందితో కలిసి నన్ను బెరించిందని ముక్తి రంజన్ ప్రతాప్ చెప్పాడని ఆమె వెల్లడించింది.
Read Also: VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..
Also Read
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
ఇక, 15 రోజుల క్రితమే ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ మహాలక్ష్మీ ఇంటికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటా.. కోపంలో ఆమెను గొంతుకోసి చంపేశాడని నాతో చెప్పినట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొనింది. ఈ విషయం తెలియగానే.. షాక్ అయ్యాను అన్నారు. కానీ, బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ముక్త రంజన్.. పోలీసుల విచారణ వల్ల మా కుటుంబానికి ఏం జరగొద్దనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని చెప్పిన కాసేపటికే సూసైడ్ చెసుకున్నాడని తెలిసిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.
Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు
కాగా, ముక్త రంజన్ బుధవారం నాడు ఒడిశాలోని తన స్వగ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న సమీపంలో లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో మహాలక్ష్మీ పెళ్లికి అంగీకరించినప్పటికి మరో వ్యక్తితో శారీరకంగా కలిసినట్లు అందులో రాసుకొచ్చాడు. అలాగే, నా దగ్గర నుంచి డబ్బు, బంగారం కోసం వేధింపులకు గురి చేసిందన్నాడు. వాటిని సహించలేకపోయా.. అందుకే ఆమెను చంపి 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్జులో పెట్టేశానని ముక్తి రంజన్ ప్రతాప్ తన డైరీలో ప్రస్తావించాడు.
తాజావార్తలు
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!