Bengaluru: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఉత్తర తాలూకాలో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని మైనర్ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో రిషబ్ పంత్ కాలికి గాయం అయ్యింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకు ఆలౌట్ అయింది.
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Bengaluru: బెంగళూర్లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు.
బెంగళూరులో రిఫ్రిజిరేటర్లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు వయాలికావల్లోని తిరుపతి తిమ్మప్ప ఆలయం ( టీటీడీ )లో లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే, బెంగళూరుకు వచ్చే లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అవును తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది . దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా వస్తోంది. అందువల్ల బెంగళూరులోని తిరుపతి దేవస్థానానికి అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా…
ఆపిల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
టెక్ హబ్గా పేరొందిన బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణం. ఈ క్రమంలో.. జనాలు చాలా సేపు ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. కాగా.. ఇటీవల తన స్నేహితురాలితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ యువతి ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ఆటోలో కూర్చున్న ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. దీంతో.. ఆటో దిగి వెళ్లి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.