PAK vs BAN ODI Series: 2026 T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించిన పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ..!
- పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ
- పాకిస్థాన్-బంగ్లాదేశ్ సిరీస్ కష్టాల్లో
- ఈ సిరీస్ ఇప్పుడు రద్దు అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మార్చి 2026లో బంగ్లాదేశ్కు వెళ్లి మూడు మ్యాచ్ల ODI సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సిరీస్ పూర్తిగా అనిశ్చితిలో పడింది. పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న జియోపాలిటికల్ టెన్షన్స్, ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ఇతర దేశాల (UAE, సౌదీ అరేబియా వంటివి) ప్రమేయం కారణంగా పాకిస్తాన్ టీమ్ బంగ్లాదేశ్కు ట్రావెల్ చేయడం ప్రమాదకరంగా మారింది. సిరీస్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ టీమ్ మార్చి 9న ఢాకాకు చేరుకోవాలి. మూడు ODI మ్యాచ్లు.. మార్చి 11, 13, 15 తేదీల్లో షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం (మిర్పూర్)లో జరగాల్సి ఉంది.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
పాకిస్తాన్ మీడియా ఔట్లెట్ జియో సూపర్ ప్రకారం, ప్రస్తుత రీజనల్ టెన్షన్స్ మరింత పెరిగితే ట్రావెల్ రిస్క్లు, సెక్యూరిటీ ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సిరీస్ పోస్ట్పోన్ లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోర్సెస్ తెలిపాయి. PCB ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, కానీ ఇన్సైడర్ల ప్రకారం సిరీస్ జరిగేందుకు పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ అనిశ్చితి గురించిన రిపోర్టులను తిరస్కరించింది. PCB నుంచి ఏవిధమైన అధికారిక కమ్యూనికేషన్ రాలేదని, సిరీస్ ప్రిపరేషన్స్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని BCB అధికారులు చెప్పారు. ఢాకాకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయని, బంగ్లాదేశ్లో ఎలాంటి సెక్యూరిటీ ఆందోళనలు లేవని వారు స్పష్టం చేశారు.
Also Read:Holi Official Holiday 2026: హోలీ సెలవుపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
ఈ సిరీస్ ముందు పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించింది. దీంతో PCB ఆటగాళ్లపై భారీ ఫైన్లు విధించింది (ప్రతి ఆటగాడికి PKR 5 మిలియన్). బాబర్ అజామ్, సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ వంటి సీనియర్లను ఈ ODI సిరీస్కు డ్రాప్ చేసే అవకాశం ఉందని రిపోర్టులు వచ్చాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని PCB ఆలోచిస్తోంది. ప్రస్తుతం సిరీస్ భవిష్యత్ పూర్తిగా మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆధారపడి ఉంది. పరిస్థితి మెరుగుపడకపోతే రెండు బోర్డుల మధ్య చర్చలు జరిగి సిరీస్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!