Asaduddin Owaisi : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అందజేసిన చిత్రపటం బహుమతిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కువైట్లో భారతీయ ప్రవాసులతో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ, పాకిస్తాన్ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ, “నకల్ కర్నేకే లియే అకల్ చాహియే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం.. 18 మంది మావోలు లొంగుబాటు “2019లో…
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు BRS లో నెలకొన్న కుటుంబ తగాదాలు కొత్త దిశగా మలుపుతీస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలో ఉందని, BRS రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అయితే, BRS లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని…
భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.
Asaduddin Owaisi: హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..? అని ప్రశ్నించిన సమయంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా ప్రతిపక్షాలు ఎంఐఎంపై చేసే ఈ ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ.. ఇది తనను నిందించడానికి, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల ప్రతిపక్షాల ద్వేషం తప్ప…
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్కి సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పుగా మారిందని విమర్శించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలిసేలా 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చచ్చే వరకు భారత భూమి కోసమే బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అన్నారు.…
Asaduddin Owaisi: AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంపై జిహాద్ పేరిట హత్యలు చేయాలని పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు. Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్కి దెబ్బ, చైనాకు…
ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న మన సాయుధ దళాలను మరియు ప్రభుత్వాన్ని నేను అభినందించాను. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నేను సూచించాను అన్నారు.. TRFని ఉగ్రవాద సంస్థగా పేర్కొనమని భారత ప్రభుత్వం.. యూఎస్ఏని కోరాలని కూడా నేను సూచించాను. FATFలో పాకిస్తాన్ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు..
భారతదేశం పాకిస్థాన్ పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒవైసీ పాకిస్థాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు.…