Asaduddin Owaisi: ఓటర్ లిస్ట్లో విదేశీయులు కనిపిస్తారు.. పహల్గాం ఉగ్రవాదులు మాత్రం కనిపించరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు, పార్లమెంటరీ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలోని బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నట్టు గుర్తించగలగినప్పుడు.. పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎలా కనుగొనలేకపోయారని ప్రశ్నించారు.
Work From Home: తండ్రి మరణం.. ఉద్యోగి బాధను లైట్ తీసుకున్న కంపెనీ.. చివరకు..?
Also Read
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
బీహార్ లో విదేశీయులను గుర్తించగలుగుతారు.. కానీ, పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు అనే దానిపై మాత్రం విచారణ ఉండదు. మీరు నిద్రపోతున్నారా..? మీ పరిపాలన కళ్లు మూసుకుని కూర్చున్నదా..? అని ఒవైసీ ప్రశ్నించారు. పహల్గాం దాడిపై దేశవ్యాప్తంగా జరిగిన “ఆపరేషన్ సిందూర్” లో భాగంగా.. ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా ఉన్న ఒవైసీ, ఈ ఆపరేషన్ను నిలిపివేయకూడదని.. నలుగురు ఉగ్రవాదుల్ని గుర్తించే వరకూ ఆపరేషన్ కొనసాగాలని కోరారు. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకూ తాను ఇలాంటి కఠిన ప్రశ్నలు అడగడం మానని హెచ్చరించారు.
ఇంకా ఒవైసీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై కూడా విమర్శలు గుప్పించారు. జూలైలో మీరు మీ తప్పును ఒప్పుకుంటున్నారు. ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెబుతున్నారని మాకు తెలుసు. కానీ, దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నారని చెప్పినట్టే సరిపోదు.. చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో 26 మంది హిందూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఒవైసీ తీవ్రంగా తీసుకున్నారు. ఈ దాడిపై సమగ్ర విచారణ, దోషుల పట్ల కఠిన చర్యలు, భద్రతా లోపాలపై స్పష్టమైన సమాధానాలు ప్రభుత్వంతో అడుగుతానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!