Asaduddin Owaisi: ఇరాన్పై అమెరికా దాడి.. పాకిస్థాన్పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
- ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు
- ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
- అనంతరం పాకిస్థాన్పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లపై అమెరికా సైన్యం వైమానిక దాడులను ఖండించారు. అనంతరం పాకిస్థాన్పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఒవైసీ గుర్తు చేశారు. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ సిఫారసు చేసిన పాక్ వైఖరి ఏంటి? అని ప్రశ్నించారు.
READ MORE: Iran Russia Meeting: యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి!
Also Read
- Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను పూర్తిగా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమాన్ని కప్పిపుచ్చేందుకే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందని భావించడంలేదని స్పష్టం చేశారు. అమెరికా చర్యలు కేవలం అంతర్జాతీయ చట్టాలు, ఐరాస చార్టర్ను మాత్రమే కాకుండా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏ దేశంపైనా యుద్ధం చేయరాదని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఒవైసీ ప్రశ్నించారు. “700 నుంచి 800 అణు వార్హెడ్లు కలిగి, ఎన్పీటీపై సంతకం చేయని, ఐఏఈఏ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్స్పెక్టర్లను అనుమతించని ఇజ్రాయెల్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!