Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది
- తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది
- కేసీఆర్ కుటుంబ పంచాయితీ.. రాజకీయంగా వాళ్లకే నష్టం
- కవిత లేకతో కాంగ్రెస్కు వచ్చిన నష్టమేమీ లేదు. : జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు BRS లో నెలకొన్న కుటుంబ తగాదాలు కొత్త దిశగా మలుపుతీస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలో ఉందని, BRS రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అయితే, BRS లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల విడుదల చేసిన లేఖపై స్పందిస్తూ, ఆ లేఖ పార్టీ క్యాడర్ను తడబాటు పరిచే అవకాశం ఉందని, ఆ క్యాడర్ బీజేపీ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని జగ్గారెడ్డి హెచ్చరించారు. “ఎవరికి వాళ్లు, నేను ఏదో అనకూడదన్న భావన మంచిది కాదు” అని అన్నారు.
స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్లు కలిగిన టాప్- 10 దేశాలు..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
“ఎవరూ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – కేసీఆర్ అంటే కేసీఆర్. ఆయన లేకుండా BRS లేదు. కేటీఆర్, హరీష్ రావు, కవితల వల్ల పార్టీ నడవదు. కవిత స్వతహాగా లీడర్ కాదు” అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కవిత తన లేఖతో “ఆ చెట్టును నరికేస్తున్నారు – అదే చెట్టు నీడలోనే తాము జీవిస్తున్నారని గుర్తించుకోవాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ వల్ల బీజేపీకి బలం చేకూరే అవకాశముందని, ఆమె బహిరంగంగా పార్టీలో విభేదాలు వెలుగులోకి తేవడం ద్వారా ప్రత్యర్థులే లాభపడతారని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. “కవిత రాజకీయ ఆత్మహత్య చేసుకుంటున్నారు. డిప్రెషన్లో ఉండి తొందరపడి లేఖ విడుదల చేశారు. ఇలా బీజేపీని పెంచి పోషించే పరిస్థితి సృష్టించకూడదు” అని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చిందని జగ్గారెడ్డి హెచ్చరించారు. “లేఖలు, లీకులు మీడియా లైవ్ల్లో కనిపిస్తాయి కానీ… అసలు ప్రభావం లోతుగా ఉంటుంది. BRS తన రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ, బీజేపీని బలోపేతం చేస్తున్నదనే విషయం కాంగ్రెస్ మర్చిపోవద్దు” అని అన్నారు.
Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!