Asaduddin Owaisi: మాలేగావ్లో ‘‘టిప్పు సుల్తాన్’’ ఫొటో వివాదం మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో ఉంచడం వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సప్కల్ టిప్పు సుల్తాన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్తో పోల్చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
Assam CM Controversy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై హైదరాబాద్ పోలీసులకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అస్సాం బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారు. ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను “కాల్చివేస్తున్నట్లు” చూపించారు, దీనిని AIMIM చీఫ్ హింసాత్మకం, రెచ్చగొట్టేదిగా ఉందని అభివర్ణించారు. READ ALSO: Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ! ఈ వీడియో…
Asaduddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సంచలన విజయాలను నమోదు చేసుకుంది. ఔరంగాబాద్, ముంబై, నాగ్పూర్ వంటి నగరాల్లో తన ఉనికిని చాటింది. మొత్తంగా 125 మంది ఎంఐఎం కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే, ఈ విజయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు.
Kishan Reddy: అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు…
Asaduddin Owaisi: జనవరి 15న ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో పౌర ఎన్నికలు జరగనున్నాయి. మరుసటి రోజు (జనవరి 16)న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రాజ్యాంగ హక్కులు, సుపరిపాలన అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని AIMIM గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రచారం చేస్తున్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్..…
Asaduddin Owaisi: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ అల్లర్లలో పెద్ద కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వకపోవడంపై చర్చ నడుస్తోంది.
Asaduddin Owaisi: బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన…
Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 5 స్థానాలను గెలుచుకుంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో తన ఉనికిని నిరూపించుకుంది. అయితే, ఈ గెలుపుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం సీమాంచల్ ఓటర్లకు థాంక్స్ చెప్పారు.