Budget 2023-24: బడ్జెట్లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ఇది…
Server Down: ఇప్పుడంతా డిజిటల్ మయం.. కొద్దిసేపు డిజిటల్ సేవలను నిలిచిపోయినా పని నడవని పరిస్థితి.. అయితే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిజిటల్ సేవలకు బ్రేక్ పడింది.. ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయ్యింది.. ఎస్డీసీ సర్వర్ డౌన్ వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.. దీంతో.. ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులకు కూడా బ్రేక్ పడింది.. డేటా సెంటర్లో అంతరాయం ఏర్పడడం వల్ల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది.. ఓవైపు…
AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ…
Employees: పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్. 16 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే.. అందులో 3 వేల కోట్ల బిల్స్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్…
Good News to Employees: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…
AP Government: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలుకు బ్రేక్ పడింది.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు చేశారు.. సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు.. అసెంబ్లీ…
Family Doctor: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. అదేరోజు ఒక విలేజ్ క్లినిక్ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి…
MoUs at GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ వేదికగా తొలి రోజు కీలక ఎంవోయూలు కుదిరాయి.. :రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు సీఎం జగన్.. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు..…
Andhra Pradesh: ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో పేద విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది.. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అడ్మిషన్ల స్వీకరణ జరుగుతోంది.. అయితే, ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. అందులో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం,…
Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి.. ఫోన్ ట్యాపింగ్ లాంటిది లేదని అంటూనే.. అసలు ట్యాపింగ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? అంటూ కొందరు నేతలు ప్రశ్నించడం కూడా చర్చగా మారిపోయింది.. అయితే, ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ వ్యవహారంపై స్పందించారు.. ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదన్న ఆయన.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తే…