ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్ను బస్సు కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస…
CM Chandrababu: పాలన కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందనే (Public Perception) అసలైన సర్టిఫికేట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అందిన సర్వే నివేదికలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు… బస్టాండ్ల దుస్థితిపై ఆగ్రహం రాష్ట్రంలోని పలు ప్రధాన బస్…
YS Jagan: గల్ఫ్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్య పాశ్చ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగన్.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుక్కుపోయారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉపాధి కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత…
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్ విజయానంద్ ని సూటిగా ప్రశ్నించింది. దీంతో ఖచ్చితంగా చేస్తామని కోర్టుకు సీఎస్ తెలిపారు.
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగిన క్వశ్చన్ అవర్ లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. త్వరలో టీచర్ల భర్తీ కోసం మరో DSC నిర్వహిస్తున్నామని తెలిపారు. టీచర్- స్టూడెంట్ రేషియో కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్లలో తక్కువగా ఉంది.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో ఇవాళ ( జనవరి 28న) కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.
CM Chandrababu: మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( జనవరి 12న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం జరగనుంది.
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ ( జనవరి8న) జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి…