Anantha VenkatRami Reddy:చంద్రబాబు హయాంలో ఈ పథకాలుండేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అమలు జరుగుతున్న పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్నే భవిష్యత్ అంటూ ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు జనం మధ్య తిరుగుతున్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, పథకాలు అందుతున్న తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతపురంలోని 23వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ హరిత ఆధ్వర్యంలో చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఆయన మండిపడ్డారు.
Read Also: IPL 2023 : డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డ్.. కోహ్లీ, ధావన్ తర్వాతే..
Also Read
- CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- SIR గడువు పొడిగింపు.. ఈసీ సవరించిన షెడ్యూల్ విడుదల
వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులతో కలిసి పలు కుటుంబాలను కలిసి ప్రజల మద్దతు కోరారు. జగనన్నే మా భవిష్యత్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు పాలనకు, జగన్ పరిపాలనకు మధ్య తేడాను వివరిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉందా? అని అడుగుతున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, భవిష్యత్లోనూ ఈ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని అందరూ కోరుతున్నారన్నారు.
ప్రజలే స్వచ్ఛందంగా జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్లను తమ ఇళ్లకు తగిలించుకుంటున్నారని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తమ పార్టీ గృహ సారథులు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు వెళ్తారని తెలిపారు. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ లోకేష్ ముందుకు వెళ్తున్నారన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారని.. ఇప్పుడు అందిస్తున్నట్లు నిజాయితీగా సంక్షేమ పథకాలను టీడీపీ పాలనలో ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలన్నారు.
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!