Cm Jagan : ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ మాసం సదర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలోని విద్యాధరపురలోని మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుని చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం జగన్ తెలిపారు. రాష్టాభివృద్ది కోసం అందరూ ప్రార్థించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
Read Also : Redya Naik : రేవంత్ రెడ్డిపై రెడ్యానాయక్ హాట్ కామెంట్స్
Also Read
ఈ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ సీఎ: అంజాద్ భాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపీనేనని డిప్యూటీ సీఎం భాషా పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎ: ఇచ్చిన ఘనత జగన్ దేనని ప్రశంసించారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు. మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇచ్చిన ఘనత.. ముస్లింలకు రిజర్వేషన్ల శాతం, ఫీజు రిజయంబర్స్ మెంట్ కూడా పెంచి ముస్లింలకు అండగా సీఎం జగన్ ఉన్నారని డిప్యూటీ సీఎం అంజద్ భాషా తెలిపారు. విద్యాధరపురం మినీ స్టేడియంలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలను సీఎం జగన్ తెలిపారు. అందరు బాగుండాలి మన రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సీఎం జగన్ కోరారు.
Read Also : RCB vs CSK: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్కు దిగిన సీఎస్కే
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!