విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై వైసీపీ అధిష్ఠానం పూర్తిగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నియమించాలనే విషయంపై సీఎం జగన్ చాలా రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
సందట్లో సడేమియాలాగా సంక్రాంతి షాపింగ్లో కిలాడీ లేడీల చేతివాటం చూపించారు. ఖంగు తినిపించే వ్యూహంతో చీరల దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతలోనే సీసీ కెమెరాల్లో చూసి నిర్వాహకులు అలెర్ట్ కాగా.. సమయ స్పూర్తితో కిలాడి లేడీలను పట్టించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.