DSC Notiification: టీచర్ పోస్టుల కోసం ఎదురుచూసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు అన్నది త్వరలో విడుదల చేస్తామన్నారు.
Read Also: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
పండగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని.. సంక్రాంతి కానుకగా ప్రకటిస్తున్నామన్నారు. ఇవాళ 4వ లిస్టు విడుదల ప్రచారాలను మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేదని, ఏదైనా సమాచారం ఉంటే అందరిని పిలిచే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.