Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Fish Curry: నాన్ వెజ్ ప్రియులకి చేపల పులుసు అంటే ఉండే ప్రాణం అంతా ఇంతా కాదు. కానీ, ప్యూర్ వెజిటేరియన్స్ కి లేదా నాన్ వెజ్ తినని రోజుల్లో ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికి చేప లేని చేపల పులుసుకు కూర మామూలు కిక్ ఇవ్వదు. నిజానికి ఈ ‘వెజ్ ఫిష్ కర్రీ’ వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అరటికాయతో చేసే ఈ పులుసు చూడటానికి అచ్చం చేప ముక్కల్లానే ఉండటమే కాకుండా, రుచిలో కూడా చేపల పులుసును తలపిస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ASLSO: T20 World Cup 2026 ఫైనల్కు ముందే సంబరాలు.. ఆకట్టుకోనున్న స్టార్ల ప్రదర్శనలు..
Also Read
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
- Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా 'బ్రదర్'.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
కావలసిన పదార్ధాలు:
అరటికాయలు: 2 (సుమారు 400 గ్రాములు)
చింతపండు: 25 గ్రాములు (నిమ్మకాయ సైజు)
ఉల్లిపాయలు: 4 (మీడియం సైజు)
టమాటాలు: 2 నుంచి 3 (ప్యూరీ కోసం)
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: అర టేబుల్ స్పూన్
మెంతులు: అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, పసుపు, ఉప్పు.
తయారీ విధానం:
ముందుగా అరటికాయలను పైన తొక్కు తీసేసి, చేప ముక్కల్లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల మధ్యలో చిన్న రంధ్రం చేస్తే అచ్చం చేప ముక్కల్లా కనిపిస్తాయి. వీటిని పసుపు, ఉప్పు కలిపిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. తర్వాత ఒక ప్లేట్లో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి మసాలా ముద్దలా చేయాలి. ఈ మసాలాను అరటికాయ ముక్కలకు పట్టించి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం, పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలను రెండు వైపులా లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులను దోరగా వేయించి పొడి చేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఉల్లి ముద్దను సిద్ధం చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. సిద్ధం చేసుకున్న ఉల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆపై టమాటా ప్యూరీని కలపాలి. నూనె పైకి తేలే సమయంలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మరిగించాలి. చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి పులుసును బాగా మరిగించాలి. పులుసు మరుగుతున్నప్పుడు రోస్ట్ చేసిన అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే గుమగుమలాడే వెజ్ ఫిష్ పులుసు సిద్ధం. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ఇంట్లో ఏదైనా స్పెషల్ సందర్భాల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు వడ్డిస్తే, ముక్క తింటే తప్ప అది చేప కాదని ఎవరూ కనిపెట్టలేరు. అంతటి అద్భుతమైన రుచితో ఈ పులుసు మెప్పిస్తుంది.
READ ASLSO: ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్తో విభేదాలు.. గంభీర్పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!