Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Fish Curry: నాన్ వెజ్ ప్రియులకి చేపల పులుసు అంటే ఉండే ప్రాణం అంతా ఇంతా కాదు. కానీ, ప్యూర్ వెజిటేరియన్స్ కి లేదా నాన్ వెజ్ తినని రోజుల్లో ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికి చేప లేని చేపల పులుసుకు కూర మామూలు కిక్ ఇవ్వదు. నిజానికి ఈ ‘వెజ్ ఫిష్ కర్రీ’ వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అరటికాయతో చేసే ఈ పులుసు చూడటానికి అచ్చం చేప ముక్కల్లానే ఉండటమే కాకుండా, రుచిలో కూడా చేపల పులుసును తలపిస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ASLSO: T20 World Cup 2026 ఫైనల్కు ముందే సంబరాలు.. ఆకట్టుకోనున్న స్టార్ల ప్రదర్శనలు..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
కావలసిన పదార్ధాలు:
అరటికాయలు: 2 (సుమారు 400 గ్రాములు)
చింతపండు: 25 గ్రాములు (నిమ్మకాయ సైజు)
ఉల్లిపాయలు: 4 (మీడియం సైజు)
టమాటాలు: 2 నుంచి 3 (ప్యూరీ కోసం)
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: అర టేబుల్ స్పూన్
మెంతులు: అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, పసుపు, ఉప్పు.
తయారీ విధానం:
ముందుగా అరటికాయలను పైన తొక్కు తీసేసి, చేప ముక్కల్లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల మధ్యలో చిన్న రంధ్రం చేస్తే అచ్చం చేప ముక్కల్లా కనిపిస్తాయి. వీటిని పసుపు, ఉప్పు కలిపిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. తర్వాత ఒక ప్లేట్లో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి మసాలా ముద్దలా చేయాలి. ఈ మసాలాను అరటికాయ ముక్కలకు పట్టించి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం, పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలను రెండు వైపులా లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులను దోరగా వేయించి పొడి చేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఉల్లి ముద్దను సిద్ధం చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. సిద్ధం చేసుకున్న ఉల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆపై టమాటా ప్యూరీని కలపాలి. నూనె పైకి తేలే సమయంలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మరిగించాలి. చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి పులుసును బాగా మరిగించాలి. పులుసు మరుగుతున్నప్పుడు రోస్ట్ చేసిన అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే గుమగుమలాడే వెజ్ ఫిష్ పులుసు సిద్ధం. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ఇంట్లో ఏదైనా స్పెషల్ సందర్భాల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు వడ్డిస్తే, ముక్క తింటే తప్ప అది చేప కాదని ఎవరూ కనిపెట్టలేరు. అంతటి అద్భుతమైన రుచితో ఈ పులుసు మెప్పిస్తుంది.
READ ASLSO: ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!