Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
ఏపీ యువతిపై బెంగళూరులో అఘాయిత్యం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిపై బెంగళూరులో అఘాయిత్యం జరిగింది… బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన యువతి.. బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం టోనీ అనే నైజీరియన్ తో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఫోన్లు మాట్లాడుకునే వరకు వెళ్లింది.. తాజాగా ఇద్దరం ఓసారి కలుద్దామని నిర్ణయానికి వచ్చారు.. ఇదే క్రమంలో ఆగస్టు 31వ తేదీన… -
విశాఖలో కరోనా కలకలం.. ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గక ముందే.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలోఉంచుకుని.. తిరిగి స్కూళ్లు, విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం… అయితే, అక్కడక్కడ వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్కు పాజిటివ్గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది. -
శ్రీశైలం జలాశయానికి కాస్త తగ్గిన వరద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం… -
నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్…
నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిన్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కొన్ని… -
కడప జిల్లా నేతలతో ముగిసిన చంద్రబాబు భేటీ… కీలక నిర్ణయాలు…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ను… -
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీలోకి వస్తారా?
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన… -
అలర్ట్ : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు… -
పుంగనూరుపై టీడీపీ ఫోకస్!
కుప్పం టార్గెట్గా అధికారపార్టీ వేగంగా పావుల్ని కదుపుతోంది. మేము ఏమైనా తక్కువా అన్నట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట టీడీపీ. కుప్పం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము పుంగనూరు సంగతి చూస్తాం అంటున్నారట అక్కడి తెలుగు తమ్ముళ్లు. నిస్తేజంగా ఉన్న పాత ఇంఛార్జ్ను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చి పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. పుంగనూరుపై టీడీపీ ఫోకస్ పెట్టిందా? చిత్తూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత… -
ఏపీ కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1520 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. ఇందులో 19,89,931 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్చ్ కాగా 14,922 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు,… -
గతంలో హడావిడి ఎక్కువ.. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం..
గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం…
తాజావార్తలు
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!