కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ఉన్నా.. సుప్రీంకోర్టు డెడ్లైన్తో వెనక్కి తగ్గి.. పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన చేసింది.. ఇక, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు..? అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పరీక్షల ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.
కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్టేనని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో పదవ తరగతి విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తామన్నారు.. స్లిప్ టెస్టులకు 70 శాతం, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్ కు 30 శాతం వెయిటేజ్ తో మార్కుల కేటాయింపు జరుగుతుందన్ ఆయన.. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామన్నారు.. రాష్ట్రంలోని మొత్తం 6.28 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని.. ఇక, ఎంసెట్ ర్యాంకింగ్లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.