మాజీ మంత్రి దేవినేని ఉమపై రాళ్ల దాడి… పరిస్థితి ఉద్రిక్తం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Read: ప్రధాని మోడీకి దీదీ కీలక సూచన…
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్పందించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలనే వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని అన్నారు. తాను ఫోన్ చేసిన తరువాతే వివాదం సద్ధుమణిగిందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు, రెచ్చగొట్టడానికే దేవినేని క్వారీ వద్దకు వెళ్లినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవినేని వైఖరి వలనే ప్రశాంతంగా ఉన్న మైలవరంలో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయని కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..