IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే!
- ముగిసిన ఐపీఎల్ 2026 వేలం
- అత్యంత ఖరీదైన ఆటగాడిగా కామెరాన్ గ్రీన్
- అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ కోసం మంగళవారం అబుదాబిలో జరిగిన మినీ వేలం ముగిసింది. మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలి మొత్తంగా రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. కోల్కతా , రాజస్థాన్ పోటీపడ్డాయి. మధ్యలో చెన్నై రేసులో నిలిచింది. చివరకు కోల్కతా గ్రీన్ను కొనుగోలు చేసింది.
శ్రీలంక పేసర్ మతీశ పతిరనకు వేలంలో భారీ దక్కింది. కనీస ధర రూ.2 కోట్లతో వేలానికి వచ్చిన అతడిని కేకేఆర్ రూ.18 కోట్లకు కైవసం చేసుకుంది. పతిరన కోసం ముందుగా ఢిల్లీ, లక్నో పోటీపడ్డాయి. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ రూ.18 కోట్లకు ఎగరేసుకుపోయింది. అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు ఊహించని ధరకు అమ్ముడయ్యారు. ఇద్దరినీ చెన్నై చెరో రూ.14.20 కోట్లకు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ను రూ.13 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేయగా.. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ను కోల్కతా రూ.9.20 కోట్లకు దక్కించుకుంది.
Also Read
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ రూ.8.60 కోట్లకు లక్నో సొంతమయ్యాడు. అతడి కోసం లక్నో, హైదరాబాద్ పోటీపడ్డాయి. భారత అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఆకిబ్ దార్కు కాసుల వర్షం కురిసింది. రూ.8.40 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. భారత్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని రూ.7.20 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను రూ.7 కోట్లకు గుజరాత్, భారత బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ను రూ.7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
Also Read: Off The Record: ప్రధాని చెప్పినా ఎంపీల్లో ఒకరు లీక్ చేశారా?.. అనుమానపు చూపులు ఎటువైపు?
టాప్-5 ప్లేయర్స్ లిస్ట్ ఇదే:
# కామెరాన్ గ్రీన్, రూ.25.20 కోట్లు, కేకేఆర్
# మతిషా పతిరనా, రూ.18 కోట్లు, కేకేఆర్
# ప్రశాంత్ వీర్, రూ.14.2 కోట్లు, సీఎస్కే
# కార్తీక్ శర్మ, రూ.14.20 కోట్లు, సీఎస్కే
# లియామ్ లివింగ్స్టోన్ రూ.13 కోట్లు, హైదరాబాద్
తాజావార్తలు
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!