IPL Auction 2026: నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డ చెన్నై, హైదరాబాద్.. అనామక ఆటగాడికి 14 కోట్లు!
- దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్పై కాసుల వర్షం
- ప్రశాంత్ రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం
- అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్పై కాసుల వర్షం కురిసింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పోటీ పడ్డాయి. ప్రశాంత్ కోసం ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేయగా.. ఆపై లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. 1.3 కోట్ల వద్ద సీఎస్కే ఎంట్రీ ఇవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులోకి వచ్చింది. 6.8 కోట్ల వద్ద ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇవ్వడంతో రాజస్థాన్ వెనక్కి తగ్గింది.
ప్రశాంత్ వీర్ కోసం సీఎస్కే, ఎస్ఆర్హెచ్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. దాంతో అతడి ధర 10 కోట్లు దాటేసింది. చివరకు 14.20 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది. దాంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాడు. అంతేకాదు ఇప్పటివరకు అమ్ముడైన వారిలో అత్యధిక ధర పలికిన భారతీయుడిగా కూడా వీర్ నిలిచాడు.
Also Read
- Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
- RCB Captain: ఆర్సీబీ కెప్టెన్ రేంజ్ అది.. క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు..
- Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్తో బరిలోకి..
- FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
Also Read: Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్కతా.. మతీశాకు మతిపోయే ధర!
ప్రశాంత్ వీర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. యూపీ టీ20 లీగ్ ద్వారా అతడు వెలుగులోకి వచ్చాడు. 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రశాంత్ రాణించాడు. 7 మ్యాచ్లలో 112 పరుగులు చేయడమే కాకుండా.. 9 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రయల్స్కు ఆహ్వానించింది. అతడి ఆటకు సీఎస్కే మేనేజ్మెంట్ ఫిదా అయింది. రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ వీర్ను జట్టులోకి తీసుకుంది. జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
-
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
-
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
-
AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?