అమరావతిలో దొంగలు పడ్డారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో దొంగలు పడ్డారా? డబ్బులు.. నగలు.. ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రోడ్డులు ఎత్తుకుపోతున్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం అమరావతిలో ఇదే హాట్ టాపిక్. ఈ దోపిడీ కేంద్రంగా రాజకీయ రగడ కూడా మొదలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రాజధాని కోసం నిర్మించిన రోడ్లను ఎత్తుకుపోతున్నారు!
Also Read
- Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
- Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది. అయినప్పటికీ పోలీసుల కన్నుగప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్లు ఎత్తుకు పోతుంది ఇళ్లలోని బంగారమో.. నగదో కాదు. రాజధాని కోసం నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారులను ఎత్తుకుపోతున్నారు. తవ్వేసి గ్రావెల్ను ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్లిపోతున్నారట. ఈ పని చేస్తోంది దొంగలో.. దొంగల మాటున ఉన్న పెద్దలో తెలియదు కానీ.. సమస్య మాత్రం రాజకీయ రంగు పులుముకుంటోంది.
రోడ్లు ఎత్తుకెళ్లడంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం!
రోడ్లు తవ్వేసి ఎత్తుకుపోతున్న కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది వైసీపీ నేతల పనే అని టీడీపీ.. కాదు తెలుగుదేశం వారి పనేనని అధికారపార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానికులే రోడ్లను తవ్వేసి.. మట్టిని ఎత్తుకుపోయి ఆ నేరాన్ని తమపై వేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాజకీయ రగడ కొనసాగుతున్న సమయంలో ఉద్దండరాయునిపాలేనికి స్థానికులు వెళ్లి చూడగా.. రోడ్లు తవ్వుతున్నవారు జేసీబీని లారీ ఎక్కించి మరీ పారిపోయారట. సమస్య ఈ విధంగా రచ్చ రచ్చగా మారడంతో వైసీపీ నేతలు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికంగానే దొంగలు ఉన్నారని.. వారి ఆచూకీ పోలీసులకు చిక్కిందని.. త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారట.
మట్టిని తొలగించి.. కాంక్రీట్ చిప్స్ ఎత్తుకెళ్లిపోతున్నారు!
ఆ మధ్య అమరావతిలో నిర్మాణాల కోసం తీసుకొచ్చిన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. అప్పట్లోనూ తీవ్ర గగ్గోలు లేచింది. ఇప్పుడు రహదారుల వంతు వచ్చింది. మట్టిని తొలగించి.. కింద ఉన్న కాంక్రీట్ చిప్స్ను తవ్వి తీసుకెళ్లిపోతున్నారు. అయితే రాజకీయ నేతల హస్తం లేకుండా ఈ విధంగా రోడ్లను తవ్వే సాహసం ఎవరూ చేయబోరన్నది స్థానికంగా వినిపించేమాట. ఆ కోణంలో చాలా వదంతలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలు వాడీవేడీగా సాగుతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు సైలెంట్?
సమస్య ముదురుపాకన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు .. రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనే ఏమో సైలెంట్ అయ్యారట. గుడని గుడిలో లింగాన్ని మింగేసే ఘనులు ఉన్నఈ రోజుల్లో రోడ్డెత్తుకుపోతున్న చోరులు ఎవరో ఏంటో ఎలా తేలుతుందో మరి. అప్పటి వరకు ఈ అంశంపై రాజకీయ రగడ రచ్చ రచ్చ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది.
తాజావార్తలు
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
-
Bangladesh: క్రికెటర్పై పోలీసుల దాడి.. బంగ్లాదేశ్లో కలకలం
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Smart Kitchen Hacks: వంటింట్లో ఇలా చేస్తే శ్రమ, సమయం, డబ్బు ఆదా.. గృహిణులకు మోస్ట్ యూస్ఫుల్ టిప్స్!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!