తాలిబన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి.. నియంత పాలన.. కఠిన నిబంధనలు.. అయితే గత కొన్ని నెలల క్రితం అఫ్ఘానిస్తాన్ను తాలిబన్ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ మహిళలు బయటకు రాకుండా హుకుంలు జారీ చేశారు. అంతేకాకుండా మహిళల స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. మొదట్లో మహిళలకు స్వేచ్చనిస్తామని ప్రకటించిన తాలిబన్ల అమలు చేయలేదు. దీంతో తాలిబన్ల తీరుపై ప్రపంచ దేశాలు పెదవి విరవడంతో.. ఇప్పుడు మళ్లీ తాలిబన్లలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళలకు త్వరలోనే ‘గుడ్న్యూస్’…
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
అసమ్మతి దెబ్బకు పదవిని వదులుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశంలో ఆయన అమెరికా తీరుపై వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినా తాను దానికి తలొగ్గలేదన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా వత్తిడికి నేను లొంగలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక…
ఆఫ్ఘనిస్తాన్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్లోని కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో శక్తివంతమైన బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా.. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడి వెనుక ఐఎస్ఎస్ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.…
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్లోని మజార్-ఎ-షరీఫ్లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..…
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన…
ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మీడియా సంస్థలు మూతపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం 34 ప్రావిన్సులుంటే ఇప్పటి వరకు సుమారు 33ప్రావిన్సుల్లోని 318 మీడియా సంస్థలు మూతపడినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ స్పష్టం చేసింది. మొత్తం 33 ప్రావిన్స్లలోని 51 టీవీ ఛానళ్లు, 132 రేడియో స్టేషన్లు, 49 ఆన్లైన్ మీడియా సంస్థలు మూసివేసినట్లు స్పష్టం చేసింది. తాలిబన్ల ఆక్రమణ ముందు వరకు దేశంలో 114 పేపర్స్ ఉంటే, తాలిబన్ల ఆక్రమణల తరువాత…
2021 ఆగస్ట్ 21నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని, మహిళల హక్కులు కాపాడతామని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా మారింది. మహిళలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు, గతంలో మాజీ ప్రభుత్వ సభ్యులు, మాజీ భద్రతాదళ…
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావోస్తున్నది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. విదేశాల్లో ఆఫ్ఘన్ నిధులు ఫ్రీజ్ కావడంతో ఆర్థికంగా ఆ దేశం కుదేలయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో చాలా మంది పిల్లల ఆకలి తీర్చేందుకు కిడ్నీలను అమ్ముకున్నారు. కాగా,…