Afghanistan: త్వరలో ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు ఫ్లైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో సమావేశం అయ్యారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత భారత్ నుంచి ఇదే అధికారిక పర్యటన
భారత్ తో పాటు చైనా, కువైట్ దేశాలకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తాలిబన్లు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘన్ వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ గా తాలిబన్లు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కాబూల్, ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు ఆఫ్ఘన్ నుంచి వైద్యం కోసం చాలా మంది భారత్ కు వస్తుంటారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ద్రాక్ష, దానిమ్మ, నేరేడు, కుంకుమ, ఔషధ మొక్కల సీజన్ అని దీంతో సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులు పున: ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది తాలిబన్ ప్రభుత్వం.
Also Read
- Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
2021, ఆగస్టు 15న అక్కడి ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం కనీస తిరుగుబాటు లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. విదేశాల నుంచి వచ్చే సాయం కూడా ఆగిపోయింది. దీంతో చేసేదేం లేక తాలిబన్లు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా ఆప్ఘనిస్తాన్ కు మానవతా సాయం అందిస్తోంది. గోధుమలు, మెడిసిన్స్ ను సరఫరా చేసింది. అక్కడి తాలిబన్ సర్కార్ కూడా తమ దేశంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులను తిరిగి ఇండియా ప్రారంభించాలని, దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తాలిబన్ ప్రభుత్వం ఉన్నతాధికారి ఇటీవల ఇండియాలో పర్యటించారు. ఇదే విధంగా భారత్ నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం తాలిబన్ లతో చర్చలు జరిపింది.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..