Afghanistan: త్వరలో ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు ఫ్లైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో సమావేశం అయ్యారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత భారత్ నుంచి ఇదే అధికారిక పర్యటన
భారత్ తో పాటు చైనా, కువైట్ దేశాలకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తాలిబన్లు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘన్ వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ గా తాలిబన్లు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కాబూల్, ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు ఆఫ్ఘన్ నుంచి వైద్యం కోసం చాలా మంది భారత్ కు వస్తుంటారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ద్రాక్ష, దానిమ్మ, నేరేడు, కుంకుమ, ఔషధ మొక్కల సీజన్ అని దీంతో సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులు పున: ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది తాలిబన్ ప్రభుత్వం.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
2021, ఆగస్టు 15న అక్కడి ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం కనీస తిరుగుబాటు లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. విదేశాల నుంచి వచ్చే సాయం కూడా ఆగిపోయింది. దీంతో చేసేదేం లేక తాలిబన్లు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా ఆప్ఘనిస్తాన్ కు మానవతా సాయం అందిస్తోంది. గోధుమలు, మెడిసిన్స్ ను సరఫరా చేసింది. అక్కడి తాలిబన్ సర్కార్ కూడా తమ దేశంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులను తిరిగి ఇండియా ప్రారంభించాలని, దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తాలిబన్ ప్రభుత్వం ఉన్నతాధికారి ఇటీవల ఇండియాలో పర్యటించారు. ఇదే విధంగా భారత్ నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం తాలిబన్ లతో చర్చలు జరిపింది.
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!