Afghanistan: త్వరలో ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు ఫ్లైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో సమావేశం అయ్యారు. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత భారత్ నుంచి ఇదే అధికారిక పర్యటన
భారత్ తో పాటు చైనా, కువైట్ దేశాలకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తాలిబన్లు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘన్ వ్యవసాయ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ గా తాలిబన్లు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కాబూల్, ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు ఆఫ్ఘన్ నుంచి వైద్యం కోసం చాలా మంది భారత్ కు వస్తుంటారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ద్రాక్ష, దానిమ్మ, నేరేడు, కుంకుమ, ఔషధ మొక్కల సీజన్ అని దీంతో సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులు పున: ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది తాలిబన్ ప్రభుత్వం.
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
2021, ఆగస్టు 15న అక్కడి ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం కనీస తిరుగుబాటు లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. విదేశాల నుంచి వచ్చే సాయం కూడా ఆగిపోయింది. దీంతో చేసేదేం లేక తాలిబన్లు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా ఆప్ఘనిస్తాన్ కు మానవతా సాయం అందిస్తోంది. గోధుమలు, మెడిసిన్స్ ను సరఫరా చేసింది. అక్కడి తాలిబన్ సర్కార్ కూడా తమ దేశంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులను తిరిగి ఇండియా ప్రారంభించాలని, దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తాలిబన్ ప్రభుత్వం ఉన్నతాధికారి ఇటీవల ఇండియాలో పర్యటించారు. ఇదే విధంగా భారత్ నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం తాలిబన్ లతో చర్చలు జరిపింది.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!