Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి..
- 2027 చివరికల్లా పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
- త్వరలోనే నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్కు స్కై వాక్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాంపల్లి స్టేషన్కు కేంద్ర ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద ఈ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నట్లు వెల్లడించారు. 2027 చివరి నాటికి ఈ స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో సిద్ధం కానుంది. దీని కోసం తొలి దశలో రూ. 327 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.
Also Read:Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
Also Read
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక స్కై వాక్ నిర్మిస్తున్నారు. విలాసవంతమైన వెయిటింగ్ లాంజ్లు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు , విశాలమైన మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. స్టేషన్ యొక్క చారిత్రక నిర్మాణ శైలిని దెబ్బతీయకుండానే లోపలి భాగాలను డిజిటలైజ్ చేయనున్నారు.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
ఇదిలా ఉండగా.. విశాఖపట్నం మరియు హైదరాబాద్ నుంచి కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇది ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రాజమండ్రి-విశాఖ మార్గంలో కొన్ని రైళ్లను (07524, 17267, 17268, 07523) ఈ నెల 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే వీరికి ప్రత్యామ్నాయంగా కాకినాడ – విజయవాడ – గుంటూరు మధ్య 16 చైర్ కార్ కోచ్లతో కూడిన ప్రత్యేక సర్వీసులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!