Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి..
- 2027 చివరికల్లా పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
- త్వరలోనే నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్కు స్కై వాక్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాంపల్లి స్టేషన్కు కేంద్ర ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద ఈ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నట్లు వెల్లడించారు. 2027 చివరి నాటికి ఈ స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో సిద్ధం కానుంది. దీని కోసం తొలి దశలో రూ. 327 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.
Also Read:Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
Also Read
ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక స్కై వాక్ నిర్మిస్తున్నారు. విలాసవంతమైన వెయిటింగ్ లాంజ్లు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు , విశాలమైన మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. స్టేషన్ యొక్క చారిత్రక నిర్మాణ శైలిని దెబ్బతీయకుండానే లోపలి భాగాలను డిజిటలైజ్ చేయనున్నారు.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
ఇదిలా ఉండగా.. విశాఖపట్నం మరియు హైదరాబాద్ నుంచి కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇది ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రాజమండ్రి-విశాఖ మార్గంలో కొన్ని రైళ్లను (07524, 17267, 17268, 07523) ఈ నెల 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే వీరికి ప్రత్యామ్నాయంగా కాకినాడ – విజయవాడ – గుంటూరు మధ్య 16 చైర్ కార్ కోచ్లతో కూడిన ప్రత్యేక సర్వీసులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!