Afghanistan: మహిళా న్యూస్ యాంకర్లు కూడా ఆ పని చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహిళా జర్నలిస్టులపై కూడా ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్. న్యూస్ చదువుతున్న మహిళా యాంకర్లు తప్పకుండా తమ మొహాలను కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆప్ఘన్ సర్కార్. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతీ మీడియా సంస్థ కూడా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని హుకుం జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్యసమితి శరణార్థి సహయ కార్యక్రమాల్లో పని చేసే మహిళలు కూడా తప్పకుండా బుర్ఖా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి అకిఫ్ మజహర్ స్పందించారు. న్యూస్ చదువుతున్న సమయంలో మహిళ యాంకర్లు మొహాన్ని కప్పుకోవాలనే ప్రతిపాదనకు మీడియా ప్రతినిధులందరూ అంగీకరిచారని వెల్లడించారు. మే 21 వరకు అందరికి వెసులుబాటు ఉంటుందని… ఆ తరువాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేసింది తాలిబన్ సర్కార్.
Also Read
- Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
2021 ఆగస్టు 15న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘన్ పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఆకలి కష్టాలు తీర్చుకోవడానికి కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నారు. కానీ తాలిబన్ ప్రభుత్వం ఇవేవి పట్టనట్లు వ్యవహరిస్తోంది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు. ఆప్ఘన్ కు ఎక్కువగా నిధులు పాశ్చాత్య దేశాల నుంచే వస్తుంటుంది. అయితే తాలిబన్ అధికారం చేపట్టిన తరువాత విదేశీ సాయం దాదాపుగా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!