Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే....
- ఏపీ, తెలంగాణ మీదుగా రెండు రైళ్లు ప్రకటన....
- 16 చైర్ కార్ కోచ్లతో నడవనున్న రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు.
Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి?
Also Read
- Suvendu Adhikari: ‘‘పారిపోండి, మీకు తిండి దండగ’’.. బంగ్లాదేశీయులకు బెంగాల్ సీఎం వార్నింగ్..
- CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
అందులో ఒకటి విశాఖపట్నం – కొల్లాం ఎక్స్ప్రెస్ (18501/18502). ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మార్గమధ్యలో దువ్వాడ స్టేషన్కు ఉదయం 8:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 5:20 గంటలకు కొల్లాంలో ప్రారంభమై.. గురువారం రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మరొక ట్రైన్.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్ప్రెస్ (17065/17066). హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 11:20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్లో బయలుదేరి.. గురువారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
నిర్వహణ కారణాల రీత్యా రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే కొన్ని రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ట్రైన్ నంబర్స్ 07524, 17267, 17268 , 07523 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ-విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 16 చైర్ కార్ కోచ్లతో నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికులకు ఊరటనిస్తున్నాయి.
తాజావార్తలు
-
Summer Health : ఎండకాలంలో లీచీ పండు తింటే ఏమవుతుందో తెలుసా..? అమృతం అనుకుంటే ప్రమాదమే.!
-
Suvendu Adhikari: ‘‘పారిపోండి, మీకు తిండి దండగ’’.. బంగ్లాదేశీయులకు బెంగాల్ సీఎం వార్నింగ్..
-
CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
-
Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
-
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!