Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే....
- ఏపీ, తెలంగాణ మీదుగా రెండు రైళ్లు ప్రకటన....
- 16 చైర్ కార్ కోచ్లతో నడవనున్న రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు.
Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి?
Also Read
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
అందులో ఒకటి విశాఖపట్నం – కొల్లాం ఎక్స్ప్రెస్ (18501/18502). ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మార్గమధ్యలో దువ్వాడ స్టేషన్కు ఉదయం 8:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 5:20 గంటలకు కొల్లాంలో ప్రారంభమై.. గురువారం రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
మరొక ట్రైన్.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్ప్రెస్ (17065/17066). హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 11:20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్లో బయలుదేరి.. గురువారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
నిర్వహణ కారణాల రీత్యా రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే కొన్ని రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ట్రైన్ నంబర్స్ 07524, 17267, 17268 , 07523 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ-విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 16 చైర్ కార్ కోచ్లతో నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికులకు ఊరటనిస్తున్నాయి.
తాజావార్తలు
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?