Afghanistan: గురుద్వారాపై ఉగ్రవాదుల దాడి.. చిక్కుకున్నసిక్కులు, హిందువులు
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం వెలుపల పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా గురుద్వారా కాంప్లెక్స్ లో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గురుద్వారాకు అనుబంధంగా ఉన్న కొన్ని దుకాణాలు ధ్వంసం అయ్యాయి.
శనివారం ఉదయం గురుద్వారాలో ప్రార్థనలు చేయడానికి 25-30 మంది ఆఫ్ఘన్ హిందువుల, సిక్కులు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఇదే సమయంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి 10-15 మంది తప్పించుకోగా.. మిగిలిన వారు గురుద్వారాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురు గ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలోని ప్రధాన దర్బార్ హాలు మంటల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
గతంలో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులు, హిందువులు టార్గెట్ గా చేసిన దాడిలో చాలా మంది మరణించారు మార్చి 25, 2020లో కాబుల్ లోని గురుద్వారా గురు హర్ రాయ్ సాహిబ్ వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది సిక్కులు మరణించారు. 2018లో జలాలాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో సిక్కు మాజీ ఎంపీ నరీందర్ సింగ్ ఖల్సా తండ్రి అవతార్ సింగ్ ఖల్సాతో సహా 19 మంది సిక్కులు, హిందువులు మరణించారు. దాడిని భారత విదేశాంత మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.
అయితే ఈ దాడికి ఐసిస్ కురాసన్ కారణం కావచ్చని తాలిబన్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరసగా మైనారిటీలు లక్ష్యంగా ఐసిస్ దాడులకు తెగబడుతోంది. షియా, హజారా వర్గాలపై దాడులు చేస్తోంది. తాజాగా హిందూ, సిక్కులపై దాడి చేసింది.
తాజావార్తలు
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో