Afghanistan: గురుద్వారాపై ఉగ్రవాదుల దాడి.. చిక్కుకున్నసిక్కులు, హిందువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం వెలుపల పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా గురుద్వారా కాంప్లెక్స్ లో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గురుద్వారాకు అనుబంధంగా ఉన్న కొన్ని దుకాణాలు ధ్వంసం అయ్యాయి.
శనివారం ఉదయం గురుద్వారాలో ప్రార్థనలు చేయడానికి 25-30 మంది ఆఫ్ఘన్ హిందువుల, సిక్కులు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఇదే సమయంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి 10-15 మంది తప్పించుకోగా.. మిగిలిన వారు గురుద్వారాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురు గ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలోని ప్రధాన దర్బార్ హాలు మంటల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
గతంలో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులు, హిందువులు టార్గెట్ గా చేసిన దాడిలో చాలా మంది మరణించారు మార్చి 25, 2020లో కాబుల్ లోని గురుద్వారా గురు హర్ రాయ్ సాహిబ్ వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది సిక్కులు మరణించారు. 2018లో జలాలాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో సిక్కు మాజీ ఎంపీ నరీందర్ సింగ్ ఖల్సా తండ్రి అవతార్ సింగ్ ఖల్సాతో సహా 19 మంది సిక్కులు, హిందువులు మరణించారు. దాడిని భారత విదేశాంత మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.
అయితే ఈ దాడికి ఐసిస్ కురాసన్ కారణం కావచ్చని తాలిబన్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరసగా మైనారిటీలు లక్ష్యంగా ఐసిస్ దాడులకు తెగబడుతోంది. షియా, హజారా వర్గాలపై దాడులు చేస్తోంది. తాజాగా హిందూ, సిక్కులపై దాడి చేసింది.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!