Kabul Gurdwara Attack: మహ్మద్ ప్రవక్తను అవమానించినందుకే ప్రతీకార దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడి చేశారు. కాబూల్ లోని బాగ్-ఇ బాలా ప్రాంతంలో గురుద్వారా కార్తే పర్వాన్ లక్ష్యంగా ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఈ దాడిలో ఒక సిక్కుతో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గుర్ని అక్కడి భద్రతాబలగాలు హతమార్చాయి. గురుద్వారాలో శనివారం ఉదయం 30 మంది వరకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ తో విరుచుకుపడ్డారు. గ్రెనెడ్ విసరడంతో గురుద్వారాలో మంటలు చెరేగాయి.
అయితే ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచినందుకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు ఉగ్రవాదులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఆప్ఘనిస్తాన్ లో పాలనను తాలిబన్లు చేజిక్కించుకున్న తరువాత నుంచి అక్కడ షియా, హజారా, సిక్కు మైనారిటీలు టార్గెట్ గా ఐఎస్ఐఎస్ దాడులకు పాల్పడుతోంది. ఇదిలా ఉంటే ఈ దాడిని ప్రధాన మంత్రి మోదీ ఖండించారు. ‘‘కాబూల్లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై జరిగిన పిరికిపంద ఉగ్రదాడితో దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను ఈ అనాగరిక దాడిని ఖండిస్తున్నాను, భక్తుల భద్రత మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ లోని సిక్కులు, హిందువుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్న జరిగిన ఉగ్రదాడిని నిశితంగా గమనిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుపోయిన సుమారు 100 మంది సిక్కులు, హిందువులకు ఈ-వీసాలు జారీ చేసింది. దీంతో వారంతా భారత్ రావడానికి మార్గం సుగమం అయింది.
గతంలో 2020లో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులను లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రదాడి జరిగింది. కాబూల్ నగరంలోని ప్రముఖ గురుద్వారా అయిన హర్ రాయ్ సాహిబ్ పై భారీ సాయుధ ఆత్మాహుతి బాంబర్ దాడి చేయడంతో 25 మంది మరణించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!