క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్లో…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి. ఏ దేశం కూడా ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆ దేశానికి చెందిన విదేశీ నిధులు స్తంభించిపోయాయి. దీంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోయాలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్దరించామని, ఇప్పటికైనా దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని…
ఆఫ్ఘనిస్తాన్ను భూకంపం వణికించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3 గా నమోదైంది. భూకంపం తాకిడికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. శిధిలాల కింద చిక్కుకొని 26 మంది మృతి చెందారు. తుర్కుమెనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బాద్గిస్ ప్రావిన్స్లో వరసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదటిసారి వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా ఉండగా, రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. రెండు భూకంపాల ధాటికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి.…
ఆఫ్ఘనిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును…
ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు…
ఏ దేశంలో అయినా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. ప్రభుత్వాలకు అధిక ఆధాయం తెచ్చిపెట్టే వాటిల్లో మద్యం ఒకటి. అయితే, కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యపానంపై నిషేధం విధిస్తుంటాయి. అయితే, తాలిబన్ ఏలుబడి ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ చట్టాలకు లొబడి మద్యం పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్లో మద్యం సేవించినా, అమ్మినా నేరం. ఇలాంటి నేరాలతో పట్టుబడితే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల పాలకుల మరో కోణం బయటపడింది. అక్కడ పాలన సాగిస్తున్న తాలిబన్లు మహిళలపై తాజాగా మరో హుకుం చేశారు. దూర ప్రయాణాలు చేసే మహిళలు ఖచ్చితంగా పురుషుడి తోడు తీసుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల వెంట కచ్చితంగా పురుషులు ఉండాల్సిందేనని, పురుషులు లేకుండా వచ్చే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించవద్దని తాలిబన్ సర్కారు స్పష్టం చేసింది. 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే వారితో పాటు కచ్చితంగా పురుషుడు వెంట…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట..…
చైనాలో పుట్టిన మాయదారి కరోనా మహమ్మారి.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్పై దృష్టిసారించాయి… భారత్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలంటూ.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని కూడా చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతోంది.. ఇక, భారత్లో నిన్నటి వరకు 137 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ జరిగింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్…