Afghanistan: దయనీయ పరిస్థితిలో అఫ్గానిస్థాన్.. భారత్ నుంచి మానవతాసాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్లో దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి మానవతాసాయం అందింది. గురువారం రాత్రి భారత్ నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, సామగ్రిని అఫ్గాన్ రాజధాని కాబూల్కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సామగ్రితో వారికి సాయం అందించేందుకు సాంకేతిక బృందం కూడా వెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యం భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గాన్ను ఆదుకున్న తొలిదేశంగా భారత్ నిలిచింది. భారత్ నుంచి వెళ్లిన బృందం తాలిబన్లతో కలిసి సాయం పంపిణీని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక బృందం భద్రత గురించి తాలిబన్ల నుంచి పలుమార్లు హామీ వచ్చాకే అక్కడికి మనదేశానికి చెందిన బృందం పయనమైంది.
ఇప్పటికే ఉగ్రదాడులు, తాలిబన్ల దాడులతో కుదేలైన అఫ్గాన్కు భూకంపంలో మరో ఆపద వచ్చిపడింది. భూకంపంలో భారీ ఎత్తున ఇళ్లు ధ్వంసం కాగా.. చాలా మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారికి తగిన వైద్య సదుపాయాలు అందే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ దుర్భర పరిస్థితుల నేపథ్యంలో భారత్ అఫ్గాన్కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. భారత్ సాయానికి అఫ్గాన్లోని తాలిబన్ సర్కారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
ఇటీవల భారత పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్లో భారీ భూకంప సంభించిన విషయం తెలసిందే. ఈ భూకంప ధాటికి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది సజీవ సమాధి అయ్యారు. అయితే.. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. భూకంపం ఎఫెక్ట్కు ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..