Nithari killings: 17 ఏళ్ల క్రితం యావత్ దేశాన్ని ఓ కదుపు కదిపేసిన ‘నిఠారీ వరస హత్యల’ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నోయిడాలోని నిఠారీలో పలువురు బాలికలు, యువతులను,
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో సోమవారం పర్యటించారు. ఇజ్రాయిల్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి కనబరచడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
‘‘నవరాత్రి శుభాకాంక్షలు! హిందూ సమాజంలోని సభ్యులకు మరియు ఈ పండుగను జరుపుకుంటున్న వారందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్రూడో పోస్ట్ చేశారు.
Air India Express: దుబాయ్-అమృత్సర్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో దగ్గర ఉన్న కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
India vs Pakistan: శనివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. పాక్ ఏ దశలోనూ ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. రోహిత్ శర్మ సిక్సర్ల సునామీ ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులతో పాటు టీవీ సెట్ల ముందు, మొబైళ్లలో కోట్ల మంది భారతీయులు ఈ మ్యాచును వీక్షించారు. వరల్డ్ కప్ లో భారత్ కు ఎదురులేదని, పాకిస్తాన్ ను 8వ సారి ఓడించి నిరూపించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.
Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు.
Bombay High Court: షార్ట్ స్కర్టులు ధరించడం, రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేయడం లేదా హావభావాలను ప్రదర్శించడం వంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే అసభ్యకరమైన చర్యలుగా పరిగణించలేమని బాంబే హైకోర్ట్, నాగ్పూర్ బెంచ్ పేర్కొంది. మే నెలలో తిర్ఖురాలోని టైగర్ ప్యారడైస్ రిసార్ట్, వాటార్ పార్క్లోని బాంక్వెట్ హాల్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేసింది.