Mahua Moitra: లంచం తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారు.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
పార్లమెంట్ లో ప్రశ్నలు అడగేందుంకు ఎంపీకి, సదరు వ్యాపారవేత్తకు మధ్య లంచాలు మారాయని, డబ్బులు, గిఫ్టుల రూపంలో లంచాలు తీసుకున్నారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరాడు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా మహువా మొయిత్రాతో పాటు టీఎంసీ ఎంపీలకు సభకు అడ్డుతగలడం అలవాటుగా మారిందని, ప్రతీ ఒక్కరిపై ఏదో సాకుతో సభను నిరంతరం దుర్వినియోగం చేస్తున్నారని, ఆమె ఇటీవల కాలంలో లోక్సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూపు పై ఉన్నాయని.. ఈ వ్యాపార గ్రూపు పైనే అక్రమాలు జరిగాయని ఆమె తరుచుగా ఆరోపించారని దూబే స్పీకర్ కి రాసిన రెండు పేజల లేఖలో పేర్కొన్నారు.
Read Also: ENG vs AFG: వరల్డ్ కప్లో సంచలనం.. ఇంగ్లాండ్పై అఫ్గానిస్తాన్ ఘన విజయం
తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యూహాలు సామాన్య ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు, ఇతర సభ్యుల రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నాయిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ‘క్విడ్ ప్రోకో’ విధానంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరో వ్యాపార గ్రూపుని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహువా మొయిత్రా ఫైర్ బ్రాండ్ ఎంపీ అనే బిరుడు బూటకం తప్ప మరేమి కాదని విమర్శించారు.
దూబే వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా… తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా స్వాగతిస్తానని అన్నారు. నకిలీ డిగ్రీవాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై అధికార ఉల్లంఘనలు పెండింగ్ లో ఉన్నాయని, స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే స్వాగతిస్తానని, నా గుమ్మం ముందుకు వచ్చే ముందు ఈడీ, ఇతర ఏజెన్సీలు అదానీ బొగ్గు కుంభకోణంపై ఎఫ్ఐార్ నమోదు చేయాలని ఆమె అన్నారు. మహువా మోయిత్రా ప్రస్తుతం బెంగాల్ లోని కృష్ణానగర్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!