Israel-Hamas War: వాహనాలే శవాగారాలు.. ఐస్ క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు.. గాజాలో దయనీయ పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
ఇజ్రాయిల్ వైమానిక దాడుల వల్ల గాజా స్ట్రిప్ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. హమాస్ స్థావరాలపై భీకరదాడులు చేస్తోంది. హమాస్ కార్యకర్తలు ఉన్నారన్న అనుమానం ఉన్న ప్రతీ భవనాన్ని లేపేస్తోంది. భారీ దాడులతో గాజా ప్రాంతంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ 2300 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
Read Also: Justin Trudeau: భారత్తో దౌత్య వివాదాల మధ్య కెనడా ప్రధాని ‘నవరాత్రి శుభాకాంక్షలు’
అంతంత మాత్రం ఆరోగ్య సదుపాయలు ఉన్న గాజా ప్రాంతంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. మృతదేహాలను పెట్టేందుకు ఆస్పత్రిలో స్థలం లేకపోవడంతో ఐస్ క్రీమ్ తరలించే ట్రక్కుల్లో మృతదేహాలను నిల్వ చేస్తున్నారు. ఐస్ క్రీం కంపెనీల నుంచి ఐస్ క్రీం ఫ్రీజర్లను తీసుకుని వచ్చామని, ఆస్పత్రి మార్చురీలో కేవలం 10 మృతదేహాలను మాత్రమే పెట్టగలిగే సామర్థ్యం ఉందని డీర్అల్ లోని షుహదా అల్-అక్సా ఆస్పత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ చెప్పారు. ఇలాగే యుద్ధం కొనసాగితే శ్మశానాలు కూడా సరిపోవని, ఇప్పటికే అవన్నీ నిండిపోయాయని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.
సూపర్ మార్కెట్లకు ఐస్ క్రీమ్లను సరఫరా చేసే ట్రక్కుల్లో మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలే గాజాలో శవాగారాలుగా మారాయి. అయితే లెక్కకు మించి మృతదేహాలు వస్తుండటంతో ఈ టక్కులు కూడా సరిపోవడం లేదు. ఒక్కో ట్రక్కులో 20-30 మృతదేహాలను పెడుతున్నారు.
ఎనిమిది రోజుల క్రితం ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. గాజాలో 2300 మంది మరణిస్తే వీరిలో నాలుగింట ఒకవంతు పిల్లుల ఉన్నారు.
మరోవైపు ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. గాజా స్ట్రిప్ ని దిగ్భందించిన ఇజ్రాయిల్ తాగునీరు, కరెంట్, ఇంధనాన్ని కట్ చేసింది. ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైన ఇజ్రాయిల్ ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!