Chandrayaan-3: భారత టెక్నాలజీని అమెరికా కోరింది.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు.
చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని నాసా- జెట్ ప్రొపెల్షన్ ల్యాబోరెటరీ నిపుణులు కోరారని సోమనాథ్ వెల్లడించారు. నాసా నుంచి చంద్రయాన్-3 పనుల్ని పరిశీలించేందుకు ఆరుగురు నిపుణులు వచ్చారని, వారికి మేము చంద్రయాన్-3ని ఎలా రూపొందించాము, చంద్రుడిపై ఎలా దిగబోతున్నాము అన్ని వివరాలను వివరించామని, వారి నుంచి ‘‘ నో కామెంట్స్.. అంతా బాగానే ఉంటుంది’’ అని అన్నారని ఇస్రో చీఫ్ వెల్లడించారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇస్రో, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిన శాస్త్రీయ పరికరాలు చాలా చౌకగా ఉండటంతో పాటు నిర్మించడం సులువు, అదే సమయంలో చాలా హై టెక్నాలజీతో రూపొందించారని, మీరు వీటిని ఎలా నిర్మించారని..? మీరు దీన్ని అమెరికాతో ఎందుకు పంచుకోకూడదని అడిగారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కాలం ఎలా మారిపోయిందో మీరు చూడవచ్చు.. మేము భారత దేశంలోని అత్యుత్తమ పరికరాలు, అత్యుత్తమ రాకెట్లను నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అందుకు మన ప్రధాని మోడీ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు దారులు తెరిచారని చెప్పారు. చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్ లోని స్కైరూట్ రాకెట్లను నిర్మిస్తోందని, భారతదేశంలోని 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నాయని సోమనాథ్ అన్నారు.
కలలు కనడం అత్యంత శక్తివంతమైన సాధనం, రాత్రిపూట కాకుండా మెలుకువగా ఉన్నప్పుడు కలలు కనాలని అబ్దుల్ కలాం సార్ చెప్పారని, ఎవరికైనా కలులు ఉన్నాయా..? ఎవరైనా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..? పిల్లల్ని ప్రశ్నించారు. చంద్రయాన్-3 ని చంద్రుడిపై ల్యాండ్ చేసిన సమయంలో, ప్రధాని మోడీ మీరు భారతీయులను చంద్రుడిపైకి ఎప్పుడు పంపుతారని అడిగారని తెలిపారు. చంద్రయాన్ -10వ సమయంలో మీలో ఒకరు రాకెట్ లో భారతదేశం నుంచి చంద్రడిపైకి వెళ్తారని, అది ఒక మహిళ కూడా కావచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!