Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Nagpur: ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక హిందువు ఈశ్వరుడిని, ముస్లిం అల్లాను, క్రిస్టియన్ ఏసు ప్రభువునే మొక్కుతారు, కానీ అన్ని మతాల వాళ్లు డాక్టర్ని ప్రార్థిస్తారని హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి డాక్టరే దేవుడు. ఇలాంటి ఆదర్శప్రాయమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్కి మద్దతు తెలుపుతున్నాయి.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.
Deepfake Issue: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ఫేక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా నిలిచారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల మరోసారి భారత్కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఓ వీడియోలో వెల్లడించారు. సిక్కులు నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.
వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Voltas: ప్రముఖ వ్యాపార సంస్థ, ఉప్పు నుంచి విమానాల దాకా వ్యాపారం చేస్తున్న టాటా గ్రూప్ తన గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ వోల్టాస్ హోమ్ అప్లియెన్సెస్ వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లుగా బ్లూమ్బర్గ్ నివేదించింది. టాటా గ్రూపుకు వోల్టాస్లో 30 శాతం వాటా ఉంది. వోల్టాస్ పేరిట ఏసీలు, ఫ్రిడ్జ్ల వంటి హోం అప్లియెన్సెస్ని టాటా తయారు చేస్తోంది.