Israel: భారతీయులకు కలిసి వస్తున్న ఇజ్రాయిల్-గాజా యుద్ధం.. లక్ష మందికి పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.
Read Also: Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
Also Read
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భారతీయులకు కలిసి వస్తోంది. ముఖ్యంగా పాలస్తీనియన్లను పూర్తిగా ఇజ్రాయిల్ నుంచి పంపించేయడంతో కార్మికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కార్మికులు, ఉద్యోగాలను భారతీయులతో భర్తీ చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. వాయిస్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం.. 90,000 మంది పాలస్తీనియన్ల స్థానంలో లక్ష మంది భారతీయ కార్మికునలు నియమించుకోవడానికి అనుమతించాలని పలు ఇజ్రాయిల్ నిర్మాణ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో తాము భారత్ తో చర్యలు జరుపుతున్నామని, తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయిల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయిల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో పనిచేయడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇండియా నుంచి 50,000 నుంచి లక్ష మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. పాలస్తీనా కార్మికులు వెళ్లడంతో ముఖ్యంగా నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి నెల రోజులు పూర్తయ్యాయి. హమాస్ని పూర్తిగా నేలమట్టం చేసేదాకా తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అమెరికాతో పాటు ఏ దేశం చెప్పిన వినే పరిస్థితిలో లేదు. గాజా స్ట్రిప్, ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ స్థావరాలను నెలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని చంపేసింది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!