Venu Goapl Reddy
Author- NTV Telugu-
North Korea: జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం
North Korea Fires Missile Over Japan: ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(ఐఆర్బీఎమ్)ను ప్రయోగించింది. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది నార్త్ కొరియా. దీంతో జపాన్ లోని క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. చివరి సారిగా 2017లో నార్త్ కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. -
Gujarat: నవరాత్రి ఉత్సవాలపై రాళ్లదాడి.. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత
Stone Pelting During Navratri: గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న గర్బా డ్యాన్స్ వేదికపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఖేడా జిల్లాలోని మాటర్ తాలూకాలోని ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో రాళ్లదాడి జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మరింత ఉద్రిక్తతలు తెలత్తకుండా పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. -
Mars Orbiter Mission: మూగబోయిన “మంగళయాన్”.. సంబంధాలు కోల్పోయామన్న ఇస్రో
Mangalyaan Life ended: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళయాన్ జీవితం ముగిసింది. అతి తక్కవ బడ్జెట్ లో హాలీవుడ్ సినిమా ‘ గ్రావిటీ’ కన్నా తక్కువ బడ్జెట్ తో మార్స్ ఆర్బిటార్ మిషన్( ఎంఓఎం)ను రూపొందించి, విజయవంతంగా అంగారక గ్రహం వరకు తీసుకెళ్లడం ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచింది. ప్రస్తుతం మార్స్ ఆర్బిటార్ గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోల్పోయిందని.. ఇకపై దానితో సంబంధాలు కొనసాగించే అవకాశం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. -
Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి, తగలబెట్టేందుకు ప్రయత్నం
jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యను అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు… -
Anti-Hijab Protest: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో 90 మందికి పైగా మృతి
Anti-Hijab Protest Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనుందుకు ఇరాన్న మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె మరణించింది. మహ్సా అమిని మరణం యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
Udhampur Blast: అమిత్ షా పర్యటన లక్ష్యంగా ఉదంపూర్ జంట పేలుళ్లు: జమ్మూ కాశ్మీర్ పోలీసులు
Udhampur Blast : సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎనిమిది గంటల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే ఉగ్రవాదాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో వివిధ కోణాల్లో ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేశామని.. ఈ ఘటనలో మహ్మద్ అమీన్ భట్ అనే నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా కాశ్మీర్ పోలీసులు తెలిపారు. -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.
Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో మమేకం అవుతున్నారు. -
Karnataka: దళిత బాలుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి..
Dalit Boy Tied To Electric Pole, Thrashed For Alleged Theft: దళిత బాలుడిపై కర్కశంగా ప్రవర్తించారు. దొంగతనం ఆరోపణలతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అడ్డొచ్చిన బాలుడి తల్లిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 14 ఏళ్ల బాలుడు చెవిపోగును దొంగిలించడనే ఆరోపణలపై పది మంది వ్యక్తుల బాలుడిని చావబాదారు. సెప్టెంబర్ 29న బెంగళూర్ సమీపంలోని దళిత వర్గానికి చెందిన బాలుడు యశ్వంత్ చెవిపోగును దొంగిలించాడని ఉన్నత వర్గం వారు ఆరోపించారు. -
Pope Francis: ఇంకెంత రక్తపాతం జరగాలి.. దయచేసి పుతిన్, జెలన్ స్కీలు యుద్ధాన్ని ఆపాలి
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి కోసం సిద్ధంగా ఉండాలని ప్రతిపాదించారు. -
Bihar: నితీష్ ప్రభుత్వానికి షాక్.. వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా..
Bihar Agriculture Minister Sudhakar Singh resigns: బీజేపీని కాదని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలిసి బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా మహాగటబంధన్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఈ మూడు పార్టీలు మంత్రివర్గంలో భాగంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!