Air India: ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు.. పంజాబ్, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల మరోసారి భారత్కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఓ వీడియోలో వెల్లడించారు. సిక్కులు నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) పంజాబ్, ఢిల్లీ విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియా విమానాలకు అదనపు భద్రతా తనిఖీలను ఆదేశించింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పంజాబ్లోని అన్ని ఎయిర్పోర్టుల్లో 100 శాతం SLPC (సెకండరీ ల్యాడర్ పాయింట్ చెక్), టెర్మినల్ బిల్డంగ్ సందర్శకులకు తాత్కాలికంగా ఎయిర్ పోర్టు ఎంట్రీ పాసులు ఇవ్వాలని ఆదేశించారు. ఢిల్లీ విమానాశ్రయంలో సందర్శకులు ప్రవేశ టికెట్ల అమ్మకాన్ని నిషేధించారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Pawan Kalyan: ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ
‘‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించవద్దని సిక్కు ప్రజల్ని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధనం ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం’’ అని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మూసేయబడుతుంది, దాని పేరు మార్చబడుతుంది, అదే రోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని హైలెట్ చేస్తూ హెచ్చరించాడు.
అంతకుముందు కూడా పన్నూ ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం నుంచి నేర్చుకోవాలని అన్నాడు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వారంతా ప్రతిస్పందిస్తారు. హింస హింసని ప్రేరేపిస్తుంది అని గతంలో ఓ వీడియోల బెదిరించే ప్రయత్నం చేశాడు.
అమృత్సర్ లో జన్మించిన గురుపత్వంత్ సింగ్ పన్నూపై 2019లో ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా, యూకే, కెనడా కేంద్రంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇతనకి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2021లో ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది. గతేడాది నవంబర్ లో అతడిని ప్రకటిత నేరస్తుడిగా గుర్తించింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!