CM Nitish Kumar: జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్కి మద్దతు తెలుపుతున్నాయి.
జనాభా నియంత్రణపై మాట్లాడుతూ.. గతంలో 4.3 శాతం సంతానోత్పత్రి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయిందని ముఖ్యమంత్రి చెబుతూ.. ‘‘సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు బాగా అవగాహన పెరిగింది. ‘ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు’. అందుకే జనాభా తగ్గుతోంది’’ అని సీఎం చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఒకింత షాక్కి గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Read Also: Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
బీజేపీ ఈ వ్యాఖ్యల్ని అసభ్యకరమైనవిగా పేర్కొంది. ‘‘భారత రాజకీయాల్లో నితీష్ కుమార్ కన్నా అసభ్యకరమైన నాయకుడు లేడు. నితీష్ కుమార్ అడల్ట్, బీ-గ్రేడ్ చిత్రాల కీటకాలు కాటు వేసినట్లు కనిపిస్తోంది. అతను డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై నిషేధం ఉండాలి.’’ అని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించింది. ముఖ్యమంత్రికి 70 ఏళ్లు దాటినా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, మేం చెప్పలేని పదాల్ని ఉపయోగించారని, దీనిపై నిరసన తెలియజేస్తామని బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి దేవీ అన్నారు.
జనాభా నియంత్రణ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ, ముఖ్యమంత్రి కొన్ని పదాలను తప్పుగా చెప్పారని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే అంగీకరించారు. మన సమాజం కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పడం నిషేధిస్తుందని ఎమ్మెల్యే ప్రతిమాదాస్ అన్నారు. సెక్స్ ఎడ్యుకేషణ్ గురించి మాట్లాడటంపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సీఎంకి మద్దతు తెలిపారు.
సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ మాట్లాడుతూ.. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతిన ప్రసంగంలో వాడిన అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి మాయని మచ్చ అని, ఇంత బహిరంగంగా ఓ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే, రాష్ట్రం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు.
On Bihar CM Nitish Kumar's statement, Chairperson of the National Commission for Women (NCW) says, "NCW on behalf of every woman in this country demand an immediate and unequivocal apology from CM Nitish Kumar. His crass remarks in the Vidhan Sabha are an affront to the dignity… https://t.co/JVv4TDKouv pic.twitter.com/LFhVE096dB
— ANI (@ANI) November 7, 2023
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!