Venu Goapl Reddy
Author- NTV Telugu-
High Court: “అత్తమామలకు సేవ చేయడం భారత సంస్కృతి”.. భార్య ‘భరణం’ కోరిన కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు..
High Court: అత్తమామల నుంచి వేరు కావాలని, తనకు భరణం కావాలని కోరిన ఓ కేసుపై జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనుస్మృతి’ని ఉటంకిస్తూ స్త్రీ గొప్పతనం, బాధ్యతలను గురించి న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మహిళలు తమ వృద్ధ అత్తమామలకు లేదా అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు పేర్కొంది. అత్తమామలకు సేవ చేయడం భారత దేశంలో సాంస్కృతిక వస్తున్న అభ్యాసంగా చెప్పింది. -
Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?
Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు బీహార్ మహఘటబంధన్ కూటమి నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తును ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి. -
Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది
Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము. -
Himanta Biswa Sarma: “ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మాకు అవసరం”.. అస్సాం సీఎం ఎగతాళి..
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Nitish Kumar: కాంగ్రెస్కి నితీష్ కుమార్ షాక్.. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనకూడదని నిర్ణయం..?
Nitish Kumar: ఇండియా కూటమికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్కి మిత్ర పక్షాలు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉండదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఎంపీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. -
Ayodhya: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు.. భర్తకు విడాకులు..
Ayodhya: అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ మహిళకు వివాహమైన ఐదు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్త సదరు మహిళను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అయితే, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తన భర్త నుంచి విడాకుల కావాలని కోరింది. మహిళ తన విడాకులను భోపాల్ లోని కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసింది. -
Best Cities In The World: ప్రపంచంలో టాప్-50 “బెస్ట్ సిటీస్” ఇవే.. భారత్ నుంచి ఒకే నగరానికి చోటు..
Best Cities In The World: ప్రపంచంలో టాప్-50 బెస్ట్ నగరాల జాబితా విడుదలైంది. టైమ్ అవుట్ ఈ జాబితాను వెల్లడించింది. నగరంలోని ఆహారం, కల్చరల్ అట్రాక్షన్, నైట్ లైఫ్ వంటి అంశాల ఆధారంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ రెండవ స్థానంలో నిలిచింది. లండన్, బెర్లిన్ మరియు మాడ్రిడ్ వరసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి. -
China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి..
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. -
Haridwar: “బ్లడ్ క్యాన్సర్” తగ్గాలని 4 ఏళ్ల బాలుడిని గంగలో ముంచిన మేనత్త.. చివరకు..
Haridwar: ఉత్తరాఖండ్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Budget Halwa: “బడ్జెట్ హల్వా” కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్.. అసలు ఈ హల్వా ప్రాముఖ్యత ఏంటి..?
Budget Halwa: మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో సాంప్రదాయ ‘హల్వా వేడుక’ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నార్గ్ బ్లాక్లోని కేంద్రం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ఉన్నారు. బడ్జెట్ ప్రక్రియ ముగింపు, ముద్రణకు ముందు ఇలా హల్వా […]
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!