Air Pollution: మాకు ఓపిక లేదు, ఆ పొగను అరికట్టండి.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రోత్సహాకాలు ఇచ్చినా, బలవంతపు చర్యలు తీసుకున్నా, ఎలాగైనా సరే పంట వ్యర్థాల దహనం ఆగాల్సిందే అని స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీసారి దీన్ని రాజకీయం చేయరాదని, ప్రతీ ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్య కోరల్లో నలిగిపోకూడదని తక్షణమే ప్రభుత్వాలు పని ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. ఈ విషయంలో మాకు ఇంకా ఓపిక లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను అక్టోబర్ 31న ఆదేశించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఎక్యూఎం) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే వ్యవసాయ వ్యర్థాల దహనం 40 శాతం తగ్గాయని నివేదిక సూచించినప్పటికీ.. ఢిల్లీ కాలుష్యంలో మార్పు ఎందుకు కనిపించడం లేదని సుప్రీం ప్రశ్నించింది.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Voltas: “వోల్టాస్”కి టాటా గుడ్ బై..?
పంజాబ్, ఢిల్లీలలో ఆప్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఈ మంటలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘మీరు నిందల్ని మార్చలేదు.. ఇది పూర్తిగా ప్రాణాలను తీయడమే, ఢిల్లీలో పరిస్థితి చూడండి, ఎంత మంది పిల్లలు నెబ్యులైజర్లపై ఉన్నారో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతీ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ వాయుకాలుష్యంలో చిక్కుకుంటోంది. ఇదిలా ఉంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వా వాహనాల సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే బస్సులు కూడా కాలుష్యానికి కారణమువుతున్నాయి, వాటిన సగం సామర్థ్యంతో నడపండి, ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!