Air Pollution: మాకు ఓపిక లేదు, ఆ పొగను అరికట్టండి.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రోత్సహాకాలు ఇచ్చినా, బలవంతపు చర్యలు తీసుకున్నా, ఎలాగైనా సరే పంట వ్యర్థాల దహనం ఆగాల్సిందే అని స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీసారి దీన్ని రాజకీయం చేయరాదని, ప్రతీ ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్య కోరల్లో నలిగిపోకూడదని తక్షణమే ప్రభుత్వాలు పని ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. ఈ విషయంలో మాకు ఇంకా ఓపిక లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను అక్టోబర్ 31న ఆదేశించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఎక్యూఎం) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే వ్యవసాయ వ్యర్థాల దహనం 40 శాతం తగ్గాయని నివేదిక సూచించినప్పటికీ.. ఢిల్లీ కాలుష్యంలో మార్పు ఎందుకు కనిపించడం లేదని సుప్రీం ప్రశ్నించింది.
Also Read
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
- TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
Read Also: Voltas: “వోల్టాస్”కి టాటా గుడ్ బై..?
పంజాబ్, ఢిల్లీలలో ఆప్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఈ మంటలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘మీరు నిందల్ని మార్చలేదు.. ఇది పూర్తిగా ప్రాణాలను తీయడమే, ఢిల్లీలో పరిస్థితి చూడండి, ఎంత మంది పిల్లలు నెబ్యులైజర్లపై ఉన్నారో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతీ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ వాయుకాలుష్యంలో చిక్కుకుంటోంది. ఇదిలా ఉంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వా వాహనాల సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే బస్సులు కూడా కాలుష్యానికి కారణమువుతున్నాయి, వాటిన సగం సామర్థ్యంతో నడపండి, ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది.
తాజావార్తలు
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!