Air Pollution: మాకు ఓపిక లేదు, ఆ పొగను అరికట్టండి.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రోత్సహాకాలు ఇచ్చినా, బలవంతపు చర్యలు తీసుకున్నా, ఎలాగైనా సరే పంట వ్యర్థాల దహనం ఆగాల్సిందే అని స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీసారి దీన్ని రాజకీయం చేయరాదని, ప్రతీ ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్య కోరల్లో నలిగిపోకూడదని తక్షణమే ప్రభుత్వాలు పని ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. ఈ విషయంలో మాకు ఇంకా ఓపిక లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలను అక్టోబర్ 31న ఆదేశించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఎక్యూఎం) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే వ్యవసాయ వ్యర్థాల దహనం 40 శాతం తగ్గాయని నివేదిక సూచించినప్పటికీ.. ఢిల్లీ కాలుష్యంలో మార్పు ఎందుకు కనిపించడం లేదని సుప్రీం ప్రశ్నించింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Voltas: “వోల్టాస్”కి టాటా గుడ్ బై..?
పంజాబ్, ఢిల్లీలలో ఆప్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఈ మంటలు ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘మీరు నిందల్ని మార్చలేదు.. ఇది పూర్తిగా ప్రాణాలను తీయడమే, ఢిల్లీలో పరిస్థితి చూడండి, ఎంత మంది పిల్లలు నెబ్యులైజర్లపై ఉన్నారో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతీ ఏడాది నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ వాయుకాలుష్యంలో చిక్కుకుంటోంది. ఇదిలా ఉంటే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వా వాహనాల సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే బస్సులు కూడా కాలుష్యానికి కారణమువుతున్నాయి, వాటిన సగం సామర్థ్యంతో నడపండి, ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!