New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్!
- న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ
- మద్యం డిపోలకు క్యూలు కడుతున్న ఆర్గనైజర్లు
- ఈ ఏడాది మద్యం విక్రయాలు రెట్టింపు అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త జోష్ అందివ్వడానికి ఈవెంట్ ఆర్గనైజర్లు నెలరోజుల ముందు నుండే సిద్దమయ్యారు. నయా సాల్ సందర్బంగా మద్యం విక్రయాలు కోసం డిపోలకు క్యూలు కడుతున్నారు ఆర్గనైజర్లు. మరో వైపు గైడ్ లైన్స్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. విదేశీ మద్యం, కల్తీ మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఓపెన్ ప్లేస్లలో నిర్వహించే ఈవెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు నిర్వహించడానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.
Also Read: Mohanlal Mother Dead: మోహన్లాల్కి మాతృవియోగం!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
రిటైల్ మద్యం స్టోర్లకు అర్ధరాత్రి 12 వరకు.. ప్లబ్బులు, క్లబ్బులకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులు ఇస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో సుమారు రూ.12 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు ఎక్సైజ్ సూపరండెంట్ ఆర్ ప్రసాద్. ఇప్పటివరకు 14 అప్లికేషన్లు న్యూ ఇయర్ ఇవెంట్స్ నిర్వహణ కోసం వచ్చాయన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ నెలలో రోజుకు సగటు రూ.5 నుంచి రూ.6 కోట్ల చొప్పున రూ.146 కోట్లు విక్రయాలు జరిగాయన్నారు. పోలీస్ శాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ఎవరైనా మితిమీరిన, పాటించకపోయినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్ ప్రసాద్ హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లిక్కర్ సేల్స్ ఎన్టీఆర్ జిల్లాలో భారీగా జరుగుతున్నాయి. జిల్లాలో రెండు డిపోల నుంచి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో డిపో నుంచి రోజుకు సాధారణ రోజుల్లో మూడు కోట్ల వరకు అమ్మకాలు జరగ్గా.. గత నాలుగు రోజుల నుంచి నాలుగు నుంచి ఐదు కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉండటంతో అమ్మకాలు జరుపుకున్నామని అధికారులు చెబుతున్నారు. రేపు కూడా భారీ ఎత్తున సేల్స్ జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. డిపో నుంచి భారీ ఎత్తున లిక్కర్ కేసులు వెళ్తుండటంతో స్థానికంగా సందడి నెలకొంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊహించిన విధంగా మద్యం స్టాక్ ఆర్డర్లు పెరిగిపోయాయి. 246 మద్యం దుకాణాలు, 28 బార్లకు సైతం ఇండెంట్లు పెరిగాయి. డిసెంబర్ 29, 30వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 18 కోట్ల విలువ చేసే లిక్కర్ను మద్యం గోడౌన్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు తరలించారు. రేపు మరింత అమ్మకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాదికి పోలిస్తే ఈ ఏడాది 5 శాతంకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఐఎంఎల్ గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని వాహనాల్లో నియోజవర్గాలకు తరలిస్తున్నారు.
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!