Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అమ్మని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్కి చెందిన సంజీవ్ కుమార్గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.
Land for jobs scam: బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూతో పాటు ఆయన కుమార్తె హేమా యాదవ్ని ఫిబ్రవరి 9న తమ ముందు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమస్లు వచ్చాయి.
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకులకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన జైపూర్ నగర సందర్శనతో మొదలైంది. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
Viral News: సాధారణంగా ప్రతీ ఏడాది మనం వచ్చే ఏడాది మనం ఎలా ఉంటాము..? ప్రపంచం ఏ విధంగా మారుతుంది..? ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది..? అని అంచనా వేస్తుంటాం. మరో వందేళ్లకు భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రిడిక్షన్స్ చెప్పడం చూస్తుంటాం. అయితే, 1924 నాటి ఓ న్యూస్ పేపర్ అంచనాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
Rahul Gandhi: 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ నేత, ఎంపీ కే మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచే పోటీ చేస్తారని చెప్పారు.
Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా ఈ రోజు రాజధాని తిరువనంతపురం నుంచి కొల్లాం జిల్లాకు వెళ్తున్న సమయంలో సీపీఎంకి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యులు గవర్నర్కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు.
INDIA bloc: వరసగా ఇండియా కూటమిలో అసంతృప్తులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మమతా బెనర్జీ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని చెప్పారు. మరోవైపు ఆప్ కూడా పంబాబ్, ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఇక బీహార రాజకీయాలు ఇండియా కూటమి ఉంటుందా..? ఉండదా..? అనే సందేశాలను లేవనెత్తింది. సీఎం నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీకలు చేయిచ్చి బీజేపీతో కలవబోతున్నారు.