Kerala: గవర్నర్ వర్సెస్ సీఎం.. ఆరిఫ్ మహ్మద్ ఖాన్కి Z+ భద్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ప్రభుత్వాల మధ్య వైరం మరింత ముదిరింది. తాజాగా ఈ రోజు రాజధాని తిరువనంతపురం నుంచి కొల్లాం జిల్లాకు వెళ్తున్న సమయంలో సీపీఎంకి సంబంధించిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యులు గవర్నర్కి వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. వాహనాన్ని ఆపేసిన గవర్నర్, అందులోంచి కిందకు దిగి ఆందోళన చేస్తు్న్న విద్యార్థుల వైపు నడుస్తూ.. రండి అంటూ ముందుకు వెళ్లారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం అన్యాయాన్ని ప్రోత్సహిస్తోందని, నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ డిమాండ్ చేశారు.
Read Also: INDIA bloc: యూపీలో 11 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం.. కాంగ్రెస్ అసంతృప్తి..
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ఇదిలా ఉంటే ఈ రోజు పరిణామాల నేపథ్యంలో గవర్నర్, కేరళ రాజ్భవన్కి Z+ భద్రతను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్భవన్కు తెలియజేసింది. గవర్నర్, ఎస్ఎఫ్ఐ సభ్యుల మధ్య రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన రోడ్డుపై బైఠాయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని చూపించే వరకు వెళ్లేందుకు నిరాకరించారు. చివరకు పోలీసులు 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఆయనకు అందించారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న ఎస్ఎఫ్ఐ సభ్యులను రక్షించాలని పోలీసులకు సీఎం ఆదేశాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరు మరియు అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై సంతకం చేయడానికి గవర్నర్ నిరాకరించడం వంటి పలు అంశాలపై భిన్నాభిప్రాయాలతో గవర్నర్ ఖాన్ మరియు లెఫ్ట్ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!