AI Effect : AI దెబ్బతో పెరగనున్న స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల ధరలు.!
- AI డిమాండ్తో మెమరీ కొరత
- ర్యామ్–ఎస్ఎస్డీ ధరల దూకుడు
- ఫోన్లు, పీసీలపై ప్రభావం
- 2027 వరకు కొనసాగనున్న సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో RAM (ర్యామ్) , SSD (మెమరీ స్టోరేజ్) చిప్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితంగా, 2026లో స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు 5 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామ్సంగ్, SK హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ మెమరీ చిప్ ఉత్పత్తిని సాధారణ స్మార్ట్ఫోన్లు, పీసీల నుండి మళ్లించి, లాభదాయకమైన AI డేటా సెంటర్ల వైపు మళ్లిస్తున్నాయి. AI సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్విడ్త్ మెమరీ (HBM) , DDR5 ర్యామ్ తయారీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సాధారణ ఎలక్ట్రానిక్ వస్తువులకు వాడే చిప్ల సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల ర్యామ్ , ఎస్ఎస్డీల ధరలు గత కొన్ని నెలల్లోనే రెండు మూడు రెట్లు పెరిగాయి. ఉదాహరణకు, గతంలో రూ. 3,000 కు లభించిన 16GB ర్యామ్ స్టిక్ ధర ఇప్పుడు రూ. 5,000 మార్కును దాటిపోయింది.
Also Read
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
Telangana Assembly : తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పెను మార్పు.. ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్..
ఈ మెమరీ సంక్షోభం కారణంగా డెల్ (Dell), లెనోవా (Lenovo), షియోమి (Xiaomi) వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మిడ్-రేంజ్ , బడ్జెట్ ఫోన్ల తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలను పెంచడం ఇష్టం లేని కంపెనీలు, అదే ధర వద్ద తక్కువ ర్యామ్ లేదా తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, యాపిల్ , సామ్సంగ్ వంటి పెద్ద కంపెనీలకు ముందే కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండటం వల్ల, వాటిపై ఈ ప్రభావం కొంత తక్కువగా ఉండవచ్చు.
ఐడీసీ (IDC) , సిటీ గ్రూప్ వంటి పరిశోధనా సంస్థల అంచనా ప్రకారం, ఈ మెమరీ చిప్ల కొరత 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో “చౌకైన మెమరీ , స్టోరేజ్ యుగం” ముగిసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 2025 నుండే అనేక కంపెనీలు తమ ధరలను సవరించడం ప్రారంభించాయి. మీరు కొత్తగా లాప్టాప్ లేదా స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగకముందే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
-
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!