Missile Arrack: భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై క్షిపణి దాడి.. ఇండియన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా నౌక వెళ్తున్న సమయంలో హౌతీలు దాడులు చేశారు. నౌక నుంచి వచ్చిన SOS కాల్కు భారత నౌకాదళం స్పందించింది. INS విశాఖపట్నం రెస్య్కూ ఆపరేషన్ కోసం మోహరించబడినట్లు నేవీ ఈ రోజు వెల్లడించింది. దాడి తర్వాత ఆయిల్ ట్యాంకర్ నౌకలో మంటలు చెలరేగాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం కార్గో షిప్కి సాయం చేస్తున్నట్లు నేవీ వెల్లడించింది. భారత నావికాదళం దృఢంగా ఉంది మరియు వ్యాపార నౌకలను రక్షించడానికి మరియు సముద్రంలో భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది” అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది.
Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
Read Also: CM YS Jagan: మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్కి మద్దతుగా నిలుస్తున్న హౌలీలు వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిల్తో సంబంధం ఉన్న వ్యాపార నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. జనవరి 18న, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారతీయ సిబ్బందితో కూడిన వ్యాపార నౌక డ్రోన్ దాడికి గురైంది. ఆ సమయంలో INS విశాఖపట్నం సాయం అందించింది. దీనికి ముందు 21 మంది భారతీయ సిబ్బందితో ఉన్న MV కెమ్ ప్లూటో డిసెంబర్ 23న భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది. అదే రోజున మరో వాణిజ్య నౌకపై కూడా ఇలాగే డ్రోన్ అటాక్ జరిగింది. ఈ షిప్లో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!