Udhampur Blast: అమిత్ షా పర్యటన లక్ష్యంగా ఉదంపూర్ జంట పేలుళ్లు: జమ్మూ కాశ్మీర్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhampur Blast : సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎనిమిది గంటల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే ఉగ్రవాదాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో వివిధ కోణాల్లో ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేశామని.. ఈ ఘటనలో మహ్మద్ అమీన్ భట్ అనే నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
పేలుళ్ల మాస్టర్ మైండ్ అమీన్ భట్ ప్రస్తుతం పాకిస్తాన్ లో స్థిరపడినట్లు డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియా యాప్ల ద్వారా అస్లాం సీక్ అనే మరో ఉగ్రవాదితో నిత్యం సంప్రదింపులు జరిపే వాడని.. డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి స్టిక్కీ బాంబులు, నాలుగు ఐఈడీలు అందించినట్లు జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్ 27న అమిత్ షా పర్యటన నేపథ్యంలో పర్యటనకు ముందు అనువైన ప్రదేశాల్లో బాంబులు అమర్చాలని అమీన్ భట్, అస్లాం సీక్ కు ఆదేశాలు ఇచ్చాడని.. దీంతో రెండు బస్సుల్లో రెండు ఐఈడీలను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
Read Also: Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్
ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి ఆగి పున్న బస్సులో పేలుడు సంభవించి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గురువారం ఇదే విధంగా మరో బస్సులో పేలుడు జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన ముందు ఈ ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. గత 6నెలలుగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించేందుకు పలు ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు మరో 5 ఐడీలను, రెండు మాడ్యూళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు మాడ్యూళ్లలో ఒకటి లష్కరే తోయిబా, మరొకటి జైషే మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందినదిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు అస్లాం సీక్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఇద్దరు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈసారి లష్కరే తోయిబా మాడ్యూల్ ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
5 IEDs including 3 sticky bombs have been recovered. With this module, a Jaish module was also linked and a person namely Zakir Hussian has been arrested and one sticky bomb has been recovered: ADGP Jammu Mukesh Singh
— ANI (@ANI) October 2, 2022
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!