Karnataka: దళిత బాలుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalit Boy Tied To Electric Pole, Thrashed For Alleged Theft: దళిత బాలుడిపై కర్కశంగా ప్రవర్తించారు. దొంగతనం ఆరోపణలతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అడ్డొచ్చిన బాలుడి తల్లిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 14 ఏళ్ల బాలుడు చెవిపోగును దొంగిలించడనే ఆరోపణలపై పది మంది వ్యక్తుల బాలుడిని చావబాదారు. సెప్టెంబర్ 29న బెంగళూర్ సమీపంలోని దళిత వర్గానికి చెందిన బాలుడు యశ్వంత్ చెవిపోగును దొంగిలించాడని ఉన్నత వర్గం వారు ఆరోపించారు.
అంతటితో ఆగకుండా బాలుడిని కరెంట్ పోల్ కు కట్టేసి చితకబాదారు. కొడుకును కొడుతుంటే చూడలేక మధ్యలో వచ్చిన తల్లిపై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. నా కొడుకు ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకుంటున్న సమయంలో చెవిపోగు దొంగిలించాడని ఉన్నత వర్గాల వారు ఆరోపణలు చేశారని.. మా కులాన్ని తుడిచిపెడుతామంటూ బెదిరించారని బాలుడి తల్లి తెలిపింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: IND Vs SA: లైవ్ మ్యాచ్లో విశేష అతిథి.. వణికిపోయిన క్రికెట్ అభిమానులు
బాలుడిపై దాడి చేసిన వ్యక్తలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో 10 మంది నిందితుల పేర్లను నమోదు చేశారు పోలీసులు. ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపగా.. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలింపు జరుగుతోంది. నాలుగేళ్ల బాలిక చెవిపోగులను బాలుడు దొంగిలించాడని స్థానికులు ఆరోపించారని.. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ:

మధ్యప్రదేశ్ లో నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టలో అగ్రవర్ణాలు, దళితులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆదివారం రోజున ఇరు వర్గాలు కూడా కర్రలతో దాడులు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 200 కిలోమీటర్ల దూరంలోని అగర్ జిల్లా కంకర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాలు తమపై దాడి చేశారని దళిత సంఘాలు ఆరోపించాయి. గర్భా ఫంక్షన్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల డ్యాన్స్ తో గొడవ ప్రారంభం అయిందని మరోవైపు వారు ఆరోపించారు. ఈ ఘటనకు బాద్యులైన వారిని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!