Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి, తగలబెట్టేందుకు ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యను అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హేమంత్ కుమార్ సొంతిళ్లు పునర్మిర్మాణంలో ఉండటంతో అని కుటుంబం స్నేహితుడు రాజీవ్ ఖజురియా ఇంట్లో ఉంటున్నారు.
Read Also: Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
హత్య జరిగినప్పటి నుంచి అతని సహాయకుడు కనిపించకుండా పోయాడు. ఇంటిలో పనిచేస్తున్న వ్యక్తిని యాసిర్ గా గుర్తించారు. అతడు రాంబన్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నట్లు జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు. 57 ఏళ్ల లోహియా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ.. హంతకుడు మొదట లోహియాను ఊపిరి ఆడకుండా చంపాడని.. గొంతు కోసేందుకు కెచప్ బాటిల్ ను పగటకొట్టి గొంతుకోశాడని.. తరువాత మృతదేహానికి తగలబెట్టేందుకు నిప్పటించే ప్రయత్నం చేశాడని అన్నారు. ఏడీజీపీ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. నేరం జరిగిన ప్రదేశాన్ని చూసి అనుమానాస్పద మరణంగా కేసు బుక్ చేశామని.. పని మనిషి పరారీలో ఉన్నాడని.. అతని కోసం వేట ప్రారంభించామని చెప్పారు. ఫోరెన్సిక్ టీమ్, క్రైమ్ టీములు ఘటన స్థలానికి చేరుకుని.. ప్రాథమిక విచారణ ప్రారంభించాయని వెల్లడించారు. హేమంత్ లోహియా మరణం పట్ల పోలీసులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దురదృష్ణమైన ఘటనగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!